కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి భేటీ

0
220

*ఢిల్లీ*

 

*కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ*

• రాష్ట్రంలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేంద్రమంత్రితో చర్చించిన సీఎం చంద్రబాబు.

• సేంద్రీయ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన అంశాన్ని భేటీలో శివరాజ్ సింగ్ చౌహన్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి.

• PM-PRANAM పథకం కింద AP కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ను విస్తరించడానికి నిధులు విడుదల చేయాలని కోరిన సీఎం చంద్రబాబు. 

• రసాయన ఎరువుల వాడకం తగ్గించడం వల్ల ఇచ్చే PM-PRANAM ప్రొత్సాహకాలను ఇవ్వాలని వినతి. 2024-25 సంవత్సరానికి గాను చెందిన రూ.216 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి.

• 2024-25 సంవత్సరంలో సాగులో రసాయనాల వినియోగం 2.28 శాతం మేర తగ్గించామన్న సిఎం

• రాష్ట్ర వ్యాప్తంగా సేంద్రీయ సాగును ప్రొత్సహిస్తున్నామని... ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులు 8 లక్షల హెక్టార్లల్లో సేంద్రీయ సాగుకు మొగ్గు చూపుతూ సమ్మతి తెలిపారని కేంద్ర మంత్రికి తెలిపిన సీఎం చంద్రబాబు

• ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి సాగు అభివృద్ధి చేయడానికి రూ. 200 కోట్ల మేర సాయం చేయాలని కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి.

• కోకోనట్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, కర్ణాటక తరహాలో మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్ల ఏర్పాటు, కొబ్బరి రైతులకు ఆధునాతన పద్దతులపై ట్రైనింగ్, నర్సరీల విస్తరణకు సహకరించాలని కోరిన చంద్రబాబు

• కొబ్బరి రైతులకు లాభం చేకూర్చేలా... సుమారు 15 వేల మందికి ఉపాధి కలిగించేలా ప్రాసెసింగ్ పార్క్, మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్లు పని చేస్తాయని వెల్లడి.

• పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం పెండింగ్ లో ఉన్న రూ.695 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం చంద్రబాబు

• ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టం కింద 2025-26 సీజన్‌లో తోతాపూరి మామిడికి కేంద్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.100 కోట్ల సాయాన్ని విడుదల చేయాలని కోరిన ముఖ్యమంత్రి.

• కేంద్రం ఇవ్వాల్సిన వాటాను కూడా ఇప్పటికే తోతాపూరి మామిడి రైతులకు చెల్లింపులు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం.

• ధరలు పడిపోవడంతో ఇబ్బందులు పడ్డ తోతాపూరి మామిడి రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వాటాను కలిపి మొత్తంగా రూ.200 కోట్ల చెల్లింపులు జరిపిన ఏపీ.

• ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.

• ఎపిలో కొల్లేరు సరస్సు ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూల వాతావరణం ఉందని..అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరిన సిఎం

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న...
By Kothuru Murali 2026-03-04 06:45:07 0 108
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో గంగ జాతర
పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం మండలాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో గంగ జాతరను నిర్వహిస్తున్నారు....
By Kothuru Murali 2026-03-16 07:00:46 0 121
Telangana
"తుర్కపల్లిలో భద్రతకు కొత్త బలం.. 22 సీసీ కెమెరాల ప్రారంభం”|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రీన్ పార్క్ అవెన్యూలో...
By Sidhu Maroju 2026-05-17 14:41:07 0 94
Andhra Pradesh
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సేవలో బిజెపి సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం
*తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సేవలో బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం*   వైకుంఠ...
By Rajini Kumari 2025-12-30 10:09:41 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com