ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి తో చంద్రబాబు నాయుడు భేటీ

0
171

*ఢిల్లీ:*

 

*ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*

 

• ఆంధ్రప్రదేశ్‌‌లోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

• రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని వివరించిన సీఎం

• వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా సవివరంగా చర్చించిన ముఖ్యమంత్రి

 

*భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలు :*

 

• పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలి

• ఈ ఆర్డర్‌ కారణంగా ప్రాజెక్టు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయి

• పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్ చేయాలి

• పోలవరం ప్రాజెక్టు ఫేజ్–IIకి ఆర్థిక సహాయం అందించాలి... ఫేజ్–IIలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉంది

• వీటికి అదనంగా సుమారు రూ.32,000 కోట్ల నిధులు అవసరం 

• గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు... తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్టు

• జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి, సాంకేతిక–ఆర్థిక సాయం ఇవ్వాలని విజ్ఞప్తి 

• ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలి 

• వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) తుది నివేదిక గెజెట్‌లో ప్రచురించాలి

• ట్రిబ్యునల్ నివేదికను వెంటనే గెజెట్‌లో ప్రచురించి, వంశధారపై నిర్మించ తలపెట్టిన నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలి

• గోదావరి జలాల పంపకంపై ఏపీ-తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోంది

• నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి

• ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అభ్యంతరం

• ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది.

Search
Categories
Read More
Telangana
వైభవంగా శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
​- పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి డాక్టర్ సీతక్క ​ మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 16(భారత్...
By Bheeshman King 2026-02-16 13:35:28 0 545
Andhra Pradesh
మదనపల్లిలో బాలికల వసతి గృహంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం.
మదనపల్లిలోని బాలికల వసతి గృహంలో ఆదివారం 'హ్యాపీ సండే' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి...
By Pagadala Venkateswar 2026-02-22 10:55:44 0 136
Telangana
సెంట్రింగ్ బాక్సుల దొంగల అరెస్టు - మీడియా ముందు ప్రవేశపెట్టిన అల్వాల్ పోలీసులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్...
By Sidhu Maroju 2025-09-17 15:09:28 0 305
Andhra Pradesh
పుంగనూరు:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం జరిగింది.
బుధవారం సాయంత్రం పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, చుక్క వారి పల్లి గ్రామంలో...
By Kothuru Murali 2026-01-15 05:39:25 0 219
SURAKSHA
Superintendent of Police for various regions, including Vizianagaram.
Madireddy Pratap IPS: A Visionary Officer Who Redefined Public Safety and Professional Policing...
By Kalaga Sailaja 2026-07-13 07:49:59 0 49
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com