TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు

0
152

 

 

TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు

10-02-2026 Tue 14:16 | Andhra

TTD Receives Huge Donations from Devotees

టీటీడీ ట్రస్టులకు హైదరాబాద్‌కు చెందిన భక్తుల నుంచి భారీ విరాళాలు

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి విరాళం

అన్నప్రసాదం, ఇతర ట్రస్టులకు మరో రూ.30 లక్షల అందజేత

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి డీడీలు అందించిన దాతలు

దాతల కుటుంబాలకు ఛైర్మన్ కృతజ్ఞతలు, పండితుల ఆశీర్వచనం

 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ట్రస్టులకు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు భక్తులు భారీగా విరాళాలు అందించారు. వేర్వేరుగా వారు మొత్తం రూ.1.30 కోట్లను టీటీడీకి అందజేశారు.

 

వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌కు చెందిన గుత్తా శ్రీ హర్షసాయి చౌదరి, టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి విరాళంగా ఇచ్చారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి, ఇందుకు సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌ (డీడీ)ను అందజేశారు. ఈ పవిత్ర కార్యానికి సహకరించిన దాత కుటుంబానికి ఛైర్మన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

 

మరో ఘటనలో, హైదరాబాద్‌కే చెందిన స్మార్ట్ సాఫ్ట్‌వేర్, మోహన్ ఇండస్ట్రీస్ ఎండీ యలమంచిలి మదన్మోహన్ రావు రూ.30 లక్షల విరాళాన్ని అందజేశారు. శ్రీవారి ఆలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడికి ఆయన డీడీని అందించారు. ఈ మొత్తాన్ని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుతో పాటు ఇతర ట్రస్టులకు వినియోగించాలని దాత కోరారు. అనంతరం, దాత మదన్మోహన్ రావు కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వచనం అందించగా, ఛైర్మన్ వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు కూడా పాల్గొన్నారు.

 

TTD

 

Tirumala Tirupati Devasthanam

 

 

Search
Categories
Read More
SURAKSHA
Dr. A. Kaushigan, IAS: Driving Excellence in Public Governance
The Journey Begins "The true purpose of public administration is to ensure that every policy...
By Fathima Safa 2026-07-15 09:00:16 0 79
Telangana
ఐఏఎస్ నరహరి గారు రచించిన "బీసీల పోరుబాట" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
 ఈటల రాజేందర్ మాట్లాడుతూ  నరహరి గారు 11వ పుస్తక ఆవిష్కరణ మా చేతుల మీదుగా చేయించినందుకు...
By Sidhu Maroju 2025-06-14 15:56:35 0 1K
Andhra Pradesh
ఘనంగా భారత్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు !!
కర్నూలు సిటీ :  జిల్లా పోలీసు కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు... జాతీయ...
By Hari Krishna 2026-01-26 08:17:24 0 518
Andhra Pradesh
మదనపల్లెలో అనుమానాస్పద మృతి.. దర్యాప్తు ప్రారంభం.
మదనపల్లె పట్టణంలో సోమవారం అన్సర్ (65) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బొంబూవీధికి...
By Pagadala Venkateswar 2026-03-24 03:33:00 0 172
Andhra Pradesh
Botsa Satyanarayana: రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనుకుంటున్నారా?: బొత్స ఘాటు వ్యాఖ్యలు.
అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించిన బొత్స సత్యనారాయణ   పోలీసులు...
By Pagadala Venkateswar 2026-02-03 06:54:50 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com