TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు

0
109

 

 

TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు

10-02-2026 Tue 14:16 | Andhra

TTD Receives Huge Donations from Devotees

టీటీడీ ట్రస్టులకు హైదరాబాద్‌కు చెందిన భక్తుల నుంచి భారీ విరాళాలు

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి విరాళం

అన్నప్రసాదం, ఇతర ట్రస్టులకు మరో రూ.30 లక్షల అందజేత

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి డీడీలు అందించిన దాతలు

దాతల కుటుంబాలకు ఛైర్మన్ కృతజ్ఞతలు, పండితుల ఆశీర్వచనం

 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ట్రస్టులకు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు భక్తులు భారీగా విరాళాలు అందించారు. వేర్వేరుగా వారు మొత్తం రూ.1.30 కోట్లను టీటీడీకి అందజేశారు.

 

వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌కు చెందిన గుత్తా శ్రీ హర్షసాయి చౌదరి, టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి విరాళంగా ఇచ్చారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి, ఇందుకు సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌ (డీడీ)ను అందజేశారు. ఈ పవిత్ర కార్యానికి సహకరించిన దాత కుటుంబానికి ఛైర్మన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

 

మరో ఘటనలో, హైదరాబాద్‌కే చెందిన స్మార్ట్ సాఫ్ట్‌వేర్, మోహన్ ఇండస్ట్రీస్ ఎండీ యలమంచిలి మదన్మోహన్ రావు రూ.30 లక్షల విరాళాన్ని అందజేశారు. శ్రీవారి ఆలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడికి ఆయన డీడీని అందించారు. ఈ మొత్తాన్ని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుతో పాటు ఇతర ట్రస్టులకు వినియోగించాలని దాత కోరారు. అనంతరం, దాత మదన్మోహన్ రావు కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వచనం అందించగా, ఛైర్మన్ వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు కూడా పాల్గొన్నారు.

 

TTD

 

Tirumala Tirupati Devasthanam

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
రాయిచోటి పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడమే తన లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ...
By Benguluri Madhubabu 2026-04-05 12:33:17 0 195
Andhra Pradesh
విజయవాడలో ఓ బి సి విద్యార్థి సంక్షేమ సంఘం నిరాహార దీక్ష
ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర...
By Rajini Kumari 2026-03-10 08:46:46 0 144
Telangana
సత్తా చాటిన ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థినులు
మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ మండలం పదవ తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయి విజయాన్ని...
By Bittu Bittu 2026-04-29 12:06:36 0 116
Telangana
పేద కుటుంబం నుండి సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకరి లిఖిత ని అభినందించిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 08 వ డివిజన్ అరుణక్క నగర్ కు చెందిన ఏకారి లిఖిత ...
By Avunoori Mahesh 2026-04-11 17:32:51 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com