Kalva Srinivasulu: సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే: వైసీపీపై ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఫైర్.

0
20

శాసనసభ చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలను వైసీపీ నేతలు పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు.

 

గత నాలుగు సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ, చర్చల స్థానంలో అరాచక ప్రవర్తనకే అలవాటు పడిందని కాల్వ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రోజు మొక్కుబడిగా సభకు వచ్చి, కాగితాలు చించి గందరగోళం సృష్టించడం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదని దుయ్యబట్టారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను చూసిన ప్రజలు, కూటమికి 164 స్థానాలిచ్చి చారిత్రక తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పటికీ వైసీపీ తన తీరు మార్చుకోకపోవడం దారుణమన్నారు.

 

వైసీపీ ప్రభుత్వ హయాంలో 22-ఏ నిబంధనను ఒక ఆయుధంగా మార్చి రైతులను, సామాన్యులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తమ అవినీతి, భూకబ్జాలపై సభలో సమాధానం చెప్పలేకనే జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉందని, నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు తమ బాధ్యతను గుర్తించి, బడ్జెట్ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై గళం విప్పాలని కాల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శుల శిక్షణ కార్యక్రమములో దర్శి టిడిపి ఇన్చార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షులు & ప్రధాన...
By Chennaiah Kati 2026-02-13 07:00:14 0 76
Andhra Pradesh
మదనపల్లి: తుమ్మచెట్లపల్లి దాడి ఘటన కొత్త మలుపు.
మదనపల్లి నియోజకవర్గం తుమ్మచెట్లపల్లిలో రైతు సురేంద్రపై బుధవారం రాత్రి జరిగిన దాడి ఘటన కొత్త మలుపు...
By Pagadala Venkateswar 2026-02-06 13:09:33 0 36
Andhra Pradesh
పశు ఆరోగ్యం పై పాడి రైతులందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి వేణుగోపాల్ తెలిపారు.
  బాపట్ల: మండలంలోని ఈతేరు గ్రామంలో శుక్రవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ...
By Gadiyapudi Narendra 2026-01-23 16:24:13 0 114
Andhra Pradesh
పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి.
కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమమే అన్ని వర్గాలకు క్షేమదాయకంగా మారిందని మాచర్ల శాసన సభ్యులు...
By John Baji 2026-01-01 02:22:56 0 60
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com