ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

0
107

*ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి* 

 

*జేసీకి బీజేపీ నాయకుల వినతి* 

 

వార్తాపత్రిక, కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 10: నిజాంపేట పరిధిలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమాలను అరికట్టి ప్రజా అవసరాలకు వినియోగించాలని బీజేపీ నాయకులు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సంయుక్త కలెక్టర్ విజయేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

బాచుపల్లి మండలం, నిజాంపేట సర్కిల్ పరిధిలోని సర్వే నంబర్లు 233/22 నుంచి 233/27 వరకు ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని, ఆ ప్రాంతంలో మినీ స్టేడియం, 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి ఆధ్వర్యంలో జేసీ విజయేందర్ రెడ్డిని కలిసి కోరారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సర్వే నంబర్ 233 పరిధిలో ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమణలకు గురైందని ఆరోపించారు. 233/22 నుంచి 233/27 వరకు సుమారు 14 ఎకరాలకు పైగా ఉన్న భూమి కూడా కబ్జాలకు గురవుతోందని తెలిపారు. కొందరు స్థానిక నాయకుల అండదండలతో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో కమర్షియల్ షాపులు నిర్మించి అద్దెల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపిస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, గతంలో డ్రైవ్-ఇన్ హోటల్ పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణం చేపట్టగా మున్సిపల్ అధికారులు కూల్చివేసినా, మళ్లీ అదే నిర్మాణం పునరుద్ధరించారని పేర్కొన్నారు. సర్వే నంబర్లు 82, 83, 84, 85లో అంబేద్కర్ భవన్, డిజిటల్ లైబ్రరీ, శ్రీకృష్ణ భవన్, పార్కులు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. సర్వే నంబర్ 340, 341, 342, 346, 347, 348, 332, 334, 95, 96, 97, 103, 105, 109 సర్వే నంబర్లలో జరుగుతున్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇందుకు స్పందించిన జేసీ విజయేందర్ రెడ్డి ప్రభుత్వ భూముల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బిక్షపతి యాదవ్, శ్రీనివాస్ గుప్తా, ఎన్.ఆర్.కే ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు !!
కర్నూలు !!  రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...  జిల్లా ఎస్పీ శ్రీ...
By Hari Krishna 2025-12-12 17:03:06 0 278
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో లాటరీ టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
పుంగనూరు పట్టణంలో నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తున్న గోవిందప్ప, మోహన్ బాబులను పోలీసులు శనివారం...
By Kothuru Murali 2026-02-08 10:25:15 0 106
Andhra Pradesh
చౌడేపల్లి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
చౌడేపల్లి జనసేన టీమ్ కూటమి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది. శ్రీరాముడి ఆశీస్సులు...
By Kothuru Murali 2026-03-26 13:43:23 0 113
Andhra Pradesh
పుంగనూరు: 'అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యలేదు.. ఆ వార్త అవాస్తవం'
పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె భర్త రామయ్య...
By Kothuru Murali 2026-02-25 09:52:49 0 110
Telangana
విద్యా మనిషికి గౌరవానీ తెస్తుంది.
కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ 75 వ వజ్రోత్సవాల సందర్భంగా...
By Dodla Nagaraju 2026-04-19 13:56:08 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com