చీరాల గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఏడాది పూర్తి త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు – పేదలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు.

0
151

చీరాల: చీరాల పట్టణంలో గత పదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనంలో ఆధునిక పరికరాలతో అత్యవసర వైద్య సేవలు అందిస్తూ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండి డాక్టర్ గోరంట్ల రాజేష్   ఆధ్వర్యంలో ప్రారంభించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం కీలక ప్రకటనలు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ రాజేష్, త్వరలోనే ఈ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ అమలులోకి వచ్చిన వెంటనే పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు హాస్పిటల్ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందికి అదనంగా, మరిన్ని అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకురావడం ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ హాస్పిటల్‌లో జనరల్ మెడిసిన్‌తో పాటు వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించి ఇక్కడి సేవలను తెలుసుకోవాలని కోరారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
బోనాల పండుగకు ప్రత్యేక నిధులు ఇప్పించండి: ఆలయ కమిటీల సభ్యులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి...
By Sidhu Maroju 2025-06-13 14:11:48 0 1K
Andhra Pradesh
కరపలో పెరుగుతున్న ప్రమాదాలు, దొంగతనాలు – ప్రజల్లో ఆందోళన
కాకినాడ జిల్లా: కరప మండలంలో వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలు మరియు రోడ్డు ప్రమాదాలతో ప్రజలు...
By Ratna Sekhar 2026-02-13 13:32:25 0 231
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో వెలసిన సుగుటూరు గంగమ్మను దర్శించుకున్న జిల్లా ఎస్పీ
పుంగనూరు పట్టణం, నగరి కాంపౌండ్ లో జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరలో అన్నమయ్య జిల్లా ఎస్పీ...
By Kothuru Murali 2026-03-11 11:00:20 0 117
Fashion & Beauty
Quiet Romance: The Dreamy Summer Fashion Trend You Need to Know
Quiet Romance: The Dreamy Summer Fashion Trend You Need to Know Summers in India can be harsh...
By BMA ADMIN 2025-05-21 13:44:39 0 2K
Andhra Pradesh
అక్షరాంధ్ర పరీక్షలకు శతశాతం హాజరు కావాలి: కలెక్టర్
ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు...
By Boiena Rajesh 2026-02-26 02:19:16 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com