చీరాల గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఏడాది పూర్తి త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు – పేదలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు.

0
189

చీరాల: చీరాల పట్టణంలో గత పదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనంలో ఆధునిక పరికరాలతో అత్యవసర వైద్య సేవలు అందిస్తూ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండి డాక్టర్ గోరంట్ల రాజేష్   ఆధ్వర్యంలో ప్రారంభించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం కీలక ప్రకటనలు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ రాజేష్, త్వరలోనే ఈ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ అమలులోకి వచ్చిన వెంటనే పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు హాస్పిటల్ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందికి అదనంగా, మరిన్ని అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకురావడం ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ హాస్పిటల్‌లో జనరల్ మెడిసిన్‌తో పాటు వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించి ఇక్కడి సేవలను తెలుసుకోవాలని కోరారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ఆదివారం కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం :
కర్నూలు : రేపు ఆదివారం కర్నూలు లో  క్లీన్ & గ్రీన్ సిటీ స్పెషల్ డ్రైవ్...నగరాన్ని క్లీన్...
By Hari Krishna 2025-12-13 10:56:23 0 332
Andhra Pradesh
పెద్దమండ్యం చెరువు కట్టపై కోళ్ల వ్యర్థాలు.
మదనపల్లె–తంబళ్లపల్లె మార్గంలోని పెద్దమండ్యం బస్టాండ్ సమీప చెరువు కట్ట వద్ద కోళ్ల వ్యర్థాలను...
By Pagadala Venkateswar 2026-07-08 11:25:01 0 48
Telangana
నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో కుల ఉన్మాదుల దాడి – 2 నెలల చిన్నారి మౌనిక మృతి బొల్లికుంట గ్రామస్తుల అశృనివాళి
నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ప్రతి మనసును కలచివేసింది. కేవలం రెండు...
By Ellandula Sandeep 2026-02-25 15:04:24 0 396
Andhra Pradesh
అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం.
  అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం   Andhra...
By Pagadala Venkateswar 2026-06-26 05:17:17 0 53
Andhra Pradesh
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు...
By Boya Dasthagiri 2026-05-06 15:44:27 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com