* ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*

1
586

*ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం ఒక నిండు సంసారాన్ని బలి తీసుకుంది. తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని నేషనూరు అనే గ్రామానికి చెందిన పద్మ (28) అనే వివాహిత తన ఇద్దరు కుమార్తెలకు (6, 5 ఏళ్లు) ఉరేసి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. 2019లో తల్లిదండ్రులను ఎదిరించి తన డిగ్రీ క్లాస్ మేట్ అయిన శివశంకర్‌ అనే యువకుడిని పద్మ పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత తన భర్త పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ అప్పులు చేయడం, కనీసం పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కూడా కట్టకపోవడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో "తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఓ గుణపాఠం. ఊరంతా అప్పులు చేసి, తీర్చలేనంటే.. నేనేం చేయాలి. ఇక ఉంటా! నేను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఈ సారైనా లైఫ్ సెటిల్ అయ్యాక చేసుకో" అంటూ లేఖ రాసి తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఉరి వేసుకుంది. భర్త శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు
ఈరోజు సాయంత్రం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటిలో జరిగే ఇఫ్తార్ విందు...
By Benguluri Madhubabu 2026-03-15 10:34:26 0 171
Telangana
గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవోగా అనిల్ బాధ్యతల స్వీకరణ
మహబూబాబాద్/ కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: మండలంలోని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా...
By Bittu Bittu 2026-02-04 13:51:21 0 328
Andhra Pradesh
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు !!
కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా : * నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు...
By Hari Krishna 2026-01-18 11:45:11 0 135
Telangana
ఓఆర్ఎస్' వివాదంలో పిల్లల డాక్టర్‌కు నోటీసులు.. ఫార్మా కంపెనీల తీరుపై మెడికల్ అసోసియేషన్లు ఆగ్రహం
హైదరాబాద్‌కు చెందిన చిన్న పిల్లల డాక్టర్ శివరంజని సంతోష్‌కు ఫార్మా కంపెనీలు లీగల్...
By Ponnala Srinivasrao 2026-03-26 04:35:13 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com