* ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*

1
631

*ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం ఒక నిండు సంసారాన్ని బలి తీసుకుంది. తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని నేషనూరు అనే గ్రామానికి చెందిన పద్మ (28) అనే వివాహిత తన ఇద్దరు కుమార్తెలకు (6, 5 ఏళ్లు) ఉరేసి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. 2019లో తల్లిదండ్రులను ఎదిరించి తన డిగ్రీ క్లాస్ మేట్ అయిన శివశంకర్‌ అనే యువకుడిని పద్మ పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత తన భర్త పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ అప్పులు చేయడం, కనీసం పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కూడా కట్టకపోవడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో "తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఓ గుణపాఠం. ఊరంతా అప్పులు చేసి, తీర్చలేనంటే.. నేనేం చేయాలి. ఇక ఉంటా! నేను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఈ సారైనా లైఫ్ సెటిల్ అయ్యాక చేసుకో" అంటూ లేఖ రాసి తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఉరి వేసుకుంది. భర్త శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నాటు సారా, నకిలీ మద్యం నియంత్రణపై కఠిన చర్యలు: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-29 07:34:37 0 147
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో గంజాయి మరియు ఇతరత్రా మారకద్రవ్యాలు విద్యార్థుల అవగాహన రాష్ డ్రైవింగ్ హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ జరిగినది. గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి గారు మరియు ఎస్పీ శ్రీ వాకుల్ జిందాల్ గారి ఆధ్వర్యంలో జరిగినవి...
*గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 26.12.2025* _*// “సంకల్పం” కార్యక్రమంలో భాగంగా...
By KOTESWARARAO KVSR 2025-12-27 02:43:07 0 248
Andhra Pradesh
వందేభారత్ రైలుకు బొబ్బిలిలో హోల్ట్ కల్పించాలి: బేబినాయన
బొబ్బిలి రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలుకు హోల్ట్ కల్పించాలని కేంద్ర విమానయాన శాఖామంత్రి కింజరాపు...
By Boiena Rajesh 2026-04-11 13:52:57 0 164
Telangana
కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్... రాజగోపాల్ రెడ్డి
కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు?  ‎తండ్రిని గౌరవించలేని మనిషి ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది?...
By Ponnala Srinivasrao 2026-04-29 09:49:30 0 118
Andhra Pradesh
నందిగామలో ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా (ప్రముఖ న్యాయవాది )
వడదెబ్బ నివారణ నందిగామ పట్టణం గురువారం ఉదయం గాంధీ సెంటర్లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొందలపాటి...
By Patan Khuddus 2026-05-07 10:52:28 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com