* ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*

1
561

*ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం ఒక నిండు సంసారాన్ని బలి తీసుకుంది. తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని నేషనూరు అనే గ్రామానికి చెందిన పద్మ (28) అనే వివాహిత తన ఇద్దరు కుమార్తెలకు (6, 5 ఏళ్లు) ఉరేసి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. 2019లో తల్లిదండ్రులను ఎదిరించి తన డిగ్రీ క్లాస్ మేట్ అయిన శివశంకర్‌ అనే యువకుడిని పద్మ పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత తన భర్త పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ అప్పులు చేయడం, కనీసం పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కూడా కట్టకపోవడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో "తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఓ గుణపాఠం. ఊరంతా అప్పులు చేసి, తీర్చలేనంటే.. నేనేం చేయాలి. ఇక ఉంటా! నేను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఈ సారైనా లైఫ్ సెటిల్ అయ్యాక చేసుకో" అంటూ లేఖ రాసి తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఉరి వేసుకుంది. భర్త శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బంగారమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి
బొబ్బిలి మండలం కొత్తపెంటలో బంగారమ్మ తల్లి ఆలయం నూతనంగా నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని...
By Boiena Rajesh 2026-02-25 13:22:15 0 223
Andhra Pradesh
తమ్ముడి మృతిపై అన్న అనుమానం: పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన.
మదనపల్లి మండలం వలసపల్లికి చెందిన పురుషోత్తం శనివారం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తన...
By Pagadala Venkateswar 2026-02-28 11:18:42 0 78
Andhra Pradesh
ఎంపీ కేసినేని స్క్రోలింగ్ పాయింట్
*జ‌గ్గయ్య‌పేట‌* *08-01-2026*   *ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్...
By Rajini Kumari 2026-01-08 11:57:29 0 117
Telangana
జర్నలిస్టుల సంక్షేమమే టీజేయు లక్ష్యం - రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గ టీజేయు కార్యాలయం ప్రారంభం.. హాజరైన పలువురు నేతలు... అభినందన వెల్లువలు...
By Sidhu Maroju 2025-05-30 14:38:05 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com