Venkaiah Naidu: నేతల నోట బూతు మాటలు.. వెంకయ్యనాయుడు ఆసక్తికర స్పందన.

0
175

కొంతమంది రాజకీయ నాయకులకు బూతులు మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయిందన్న వెంకయ్య నాయుడు

కొందరు నేతలు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేసే దుస్థితికి దిగజారుతున్నారని ఆవేదన

అటువంటి వారికి ప్రజలు ఎన్నికల్లో నిశ్శబ్దంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్న వెంకయ్య నాయుడు

బూతులు మాట్లాడే రాజకీయ నేతలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారికి ప్రజలు పోలింగ్ బూత్‌లలోనే తగిన సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 

 

ఏపీలో పలువురు రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై వెంకయ్యనాయుడు పలు సందర్భాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా విశాఖ జిల్లా పెందుర్తిలో బాలాజీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలోనూ ఆయన రాజకీయ నాయకుల భాషపై స్పందించారు. కొంతమంది రాజకీయ నాయకులకు బూతులు మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయిందని వెంకయ్యనాయుడు విమర్శించారు. అలా మాట్లాడితే పత్రికల్లో ప్రచురిస్తారని, వార్తల్లో వస్తామని భావించి అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. 

 

సక్రమంగా మాట్లాడే సామర్థ్యం లేక కొందరు నేతలు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేసే దుస్థితికి దిగజారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి అన్ని పార్టీల నాయకుల్లోనూ ఉందని, అయితే కొందరు మాత్రం ఇంకా పద్ధతిగా, మంచిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అసందర్భంగా ప్రసంగాలు చేసే నేతలకు ప్రజలు ఎన్నికల్లో నిశ్శబ్దంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని, అప్పుడే అసెంబ్లీ, పార్లమెంటులో మంచి విలువలు పెరుగుతాయని, భవిష్యత్తు తరాలు మంచి విషయాలను నేర్చుకుంటాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.

Search
Categories
Read More
Business & Finance
Electrosteel Castings Resumes Mini Blast Furnace Operations
Electrosteel Castings has resumed operations at its Mini Blast Furnace (MBF) facility in West...
By Navya Sree 2026-07-04 06:44:52 0 40
Andhra Pradesh
దేవుడి చిత్రపటాలతో రాజకీయాలు తగవు
*ప్ర‌చుర‌ణార్థం* *21-02-2026*   *దేవుడి చిత్రపటాలతో రాజకీయాలు తగవు : ఎన్టీఆర్...
By Rajini Kumari 2026-02-21 16:49:22 0 157
Andhra Pradesh
పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
పదో తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు...
By Benguluri Madhubabu 2026-03-11 05:17:09 0 189
Andhra Pradesh
Vangalapudi Anita: వెంకటగిరి విద్యార్థినుల నిజాయతీ నన్ను గర్వపడేలా చేసింది: హోంమంత్రి అనిత.
    Vangalapudi Anita: వెంకటగిరి విద్యార్థినుల నిజాయతీ నన్ను గర్వపడేలా చేసింది:...
By Pagadala Venkateswar 2026-03-06 09:31:50 0 135
Telangana
ఆటో డ్రైవర్ నిజాయితీ- తన ఆటోలో మర్చిపోయిన విలువైన ఆభరణాలను అందజేసి ప్రశంసలు పొందాడు.|
హైదరాబాద్ : బెంగళూరులో నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ మరిచిపోయిన మనీ పర్స్‌ను...
By Sidhu Maroju 2026-02-27 06:23:46 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com