Venkaiah Naidu: నేతల నోట బూతు మాటలు.. వెంకయ్యనాయుడు ఆసక్తికర స్పందన.

0
173

కొంతమంది రాజకీయ నాయకులకు బూతులు మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయిందన్న వెంకయ్య నాయుడు

కొందరు నేతలు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేసే దుస్థితికి దిగజారుతున్నారని ఆవేదన

అటువంటి వారికి ప్రజలు ఎన్నికల్లో నిశ్శబ్దంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్న వెంకయ్య నాయుడు

బూతులు మాట్లాడే రాజకీయ నేతలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారికి ప్రజలు పోలింగ్ బూత్‌లలోనే తగిన సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 

 

ఏపీలో పలువురు రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై వెంకయ్యనాయుడు పలు సందర్భాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా విశాఖ జిల్లా పెందుర్తిలో బాలాజీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలోనూ ఆయన రాజకీయ నాయకుల భాషపై స్పందించారు. కొంతమంది రాజకీయ నాయకులకు బూతులు మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయిందని వెంకయ్యనాయుడు విమర్శించారు. అలా మాట్లాడితే పత్రికల్లో ప్రచురిస్తారని, వార్తల్లో వస్తామని భావించి అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. 

 

సక్రమంగా మాట్లాడే సామర్థ్యం లేక కొందరు నేతలు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేసే దుస్థితికి దిగజారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి అన్ని పార్టీల నాయకుల్లోనూ ఉందని, అయితే కొందరు మాత్రం ఇంకా పద్ధతిగా, మంచిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అసందర్భంగా ప్రసంగాలు చేసే నేతలకు ప్రజలు ఎన్నికల్లో నిశ్శబ్దంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని, అప్పుడే అసెంబ్లీ, పార్లమెంటులో మంచి విలువలు పెరుగుతాయని, భవిష్యత్తు తరాలు మంచి విషయాలను నేర్చుకుంటాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.

Search
Categories
Read More
Telangana
అత్యంత వైభవంగా కాజీపల్లి రేణుక ఎల్లమ్మ తల్లి జాతర
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా,...
By Ponnala Srinivasrao 2026-03-17 13:13:46 0 242
Andhra Pradesh
ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు ఎస్పీ !
కర్నూలు :సి.హెచ్. ద్వారకా తిరుమల రావు ఐపియస్ గారిని  మర్యాదపూర్వకంగా కలిసిన ...జిల్లా...
By Hari Krishna 2025-12-30 16:31:00 0 263
Andhra Pradesh
ఇంద్రకీలాతి కేశఖండనశాల వేలం ప్రక్రియ పూర్తి 80% మేరకు పెరిగిన ఆదాయం
*ఇంద్రకీలాద్రిపై కేశఖండన శాల వెంట్రుకల వేలం ప్రక్రియ పూర్తి* – *సుమారు 80% మేర పెరిగిన...
By Rajini Kumari 2025-12-29 13:18:43 0 179
Andhra Pradesh
మదనపల్లెలో మామపై అల్లుడు దాడి
మదనపల్లె మండలంలో కుటుంబ వివాదం నేపథ్యంలో సోమవారం మామపై అల్లుడు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది....
By Pagadala Venkateswar 2026-06-16 04:20:28 0 51
Telangana
గణేష్ ఉత్సవాలు ఐక్యతకు ప్రత్యేకంగా నిలుస్తాయి : బిఆర్ఎస్ నాయకులు శంబీపూర్ కృష్ణ.
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:   వినాయక చవితి ఉత్సవాల భాగంగా ...
By Sidhu Maroju 2025-09-09 17:12:50 0 344
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com