Venkaiah Naidu: నేతల నోట బూతు మాటలు.. వెంకయ్యనాయుడు ఆసక్తికర స్పందన.

0
174

కొంతమంది రాజకీయ నాయకులకు బూతులు మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయిందన్న వెంకయ్య నాయుడు

కొందరు నేతలు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేసే దుస్థితికి దిగజారుతున్నారని ఆవేదన

అటువంటి వారికి ప్రజలు ఎన్నికల్లో నిశ్శబ్దంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్న వెంకయ్య నాయుడు

బూతులు మాట్లాడే రాజకీయ నేతలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారికి ప్రజలు పోలింగ్ బూత్‌లలోనే తగిన సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 

 

ఏపీలో పలువురు రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై వెంకయ్యనాయుడు పలు సందర్భాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా విశాఖ జిల్లా పెందుర్తిలో బాలాజీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలోనూ ఆయన రాజకీయ నాయకుల భాషపై స్పందించారు. కొంతమంది రాజకీయ నాయకులకు బూతులు మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయిందని వెంకయ్యనాయుడు విమర్శించారు. అలా మాట్లాడితే పత్రికల్లో ప్రచురిస్తారని, వార్తల్లో వస్తామని భావించి అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. 

 

సక్రమంగా మాట్లాడే సామర్థ్యం లేక కొందరు నేతలు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేసే దుస్థితికి దిగజారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి అన్ని పార్టీల నాయకుల్లోనూ ఉందని, అయితే కొందరు మాత్రం ఇంకా పద్ధతిగా, మంచిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అసందర్భంగా ప్రసంగాలు చేసే నేతలకు ప్రజలు ఎన్నికల్లో నిశ్శబ్దంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని, అప్పుడే అసెంబ్లీ, పార్లమెంటులో మంచి విలువలు పెరుగుతాయని, భవిష్యత్తు తరాలు మంచి విషయాలను నేర్చుకుంటాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.

Search
Categories
Read More
SURAKSHA
WB Police Show Kindness to the Homeless and Elderly
 Content: Beyond their law enforcement duties, West Bengal Police officers frequently engage...
By Kalaga Sailaja 2026-06-27 08:49:11 0 94
Andhra Pradesh
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 1 to 1 సమావేశాలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో...
By Rajini Kumari 2025-12-19 11:01:06 0 215
Telangana
నాన్నగారు దేశం కోసం ధర్మంకోసం ఇంతలా పాకులాడుతుంటే నువ్వెందుకు కనపడకుండా పోయావ్? బగీరత్ బాబు..సురేష్ సందరికారి
‎మా భగి బాబు ఒక్కరోజు కనపడకపోతేనే విలవిల్లాడిపోతాం అలాంటిది మన కరీంనగర్ ఆణిముత్యం సాక్చాత్తూ...
By Ponnala Srinivasrao 2026-05-13 00:38:38 0 112
Telangana
"సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాలయం రైల్వే క్వార్టర్స్ వద్ద...
By Sidhu Maroju 2026-05-30 16:51:53 0 249
Andhra Pradesh
దాతృత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు
తుమ్మలపల్లి   *25-12-2025*    *దాత్రుత్వంతో మనసు గెలుచుకున్న మారాజు...
By Rajini Kumari 2025-12-25 07:57:21 0 304
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com