'నరేంద్ర విజయం' పుస్తకావిష్కరణ.|

0
175

"11 ఏళ్ల మోదీ పాలనపై సంకలన గ్రంథం విడుదల"

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గత 11 ఏళ్ల పాలనలో అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ విధానాలపై రూపొందించిన 'నరేంద్ర విజయం' పుస్తకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం ఆవిష్కరించారు.

ఈ పుస్తకాన్ని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి సంకలనం చేయగా, దేశంలోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 మంది ప్రముఖుల వ్యాసాలను ఇందులో పొందుపరిచారు.

ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ, ఇలాంటి పుస్తకాల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, దేశాభివృద్ధికి తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రజలకు మరింత విస్తృతంగా చేరుతాయని అన్నారు. ఈ గ్రంథం రూపకల్పనలో గీతా మూర్తి చేసిన కృషిని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
Dr B.R. Ambedkar birthday
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ....
By G k Nookala 2026-04-13 22:09:44 0 251
Andhra Pradesh
ఆ మృతదేహం ఆచూకీ లభ్యం.
మదనపల్లె మండలం కొండామారిపల్లె సమీపంలో బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి...
By Pagadala Venkateswar 2026-05-16 05:10:43 0 91
Mizoram
Mizoram Advances Women's Empowerment Through New Initiatives
Mizoram continues to strengthen women's empowerment through initiatives focused on education,...
By Fathima Safa 2026-07-01 10:59:50 0 78
Rajasthan
Rajasthan Cabinet Approves Medical Tourism, Green Energy & Urban Policies
On July 15, Rajasthan’s State Cabinet led by CM Bhajan Lal Sharma approved three...
By Bharat Aawaz 2025-07-17 07:24:18 0 2K
Telangana
రోడ్డుమీద చెత్త వేస్తున్నారా.. అయితే 8 రోజుల జైలు శిక్ష ఖాయం.
   హైదరాబాద్:    సెక్షన్ 70(బీ), 66 సీపీ యాక్ట్ కింద.. రోడ్డుపై చెత్త...
By Sidhu Maroju 2025-09-14 11:55:42 0 295
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com