75 ఏళ్ల నిరీక్షణకు తెర.. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు, ఏప్రిల్ 13న ప్రారంభం,

0
306

జిల్లా ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. జిల్లా చరిత్రలోనే 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభం కానుంది.

విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇది మనందరికీ గర్వకారణమంటూ అచ్చెన్నాయుడు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం 17439/40 హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి ఈ రైలు సర్వీసును ప్రారంభించనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

 

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను గుర్తించి, ప్రత్యేక చొరవ చూపించి రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ఈ రైలు సర్వీసు మంజూరులో కీలక పాత్ర పోషించినందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు.. అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పథంలో ఇదొక చరిత్రాత్మక ఘట్టంగా అచ్చెన్నాయుడు అభివర్ణించారు. మరోవైపు తిరుపతి - శ్రీకాకుళం రోడ్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు (17439) ప్రతి ఆదివారం తిరుపతి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయల్దేరుతుంది. సోమవారల మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. ఇక శ్రీకాకుళం - తిరుపతి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (17440) ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రైల్వే్ స్టేషన్‌ నుంచి బయల్దేరుతుంది. మంగళవారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది

.

 

References

Search
Categories
Read More
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:00:59 1 321
Andaman & Nikobar Islands
Tourists Advised to Follow Weather Safety Guidelines
The Andaman & Nicobar Administration has advised tourists visiting popular island...
By Navya Sree 2026-06-27 06:52:04 0 73
Andhra Pradesh
బసినికొండ వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లె సమీపంలోని బసినికొండ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ (24) అనే యువకుడు...
By Pagadala Venkateswar 2026-04-09 04:33:58 0 131
Telangana
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట : పాల్గొన్న ఎమ్మెల్యే
         మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.  ...
By Sidhu Maroju 2025-08-10 16:18:13 0 754
Andhra Pradesh
"సుపరిపాలన దినోత్సవం" సందర్భంగా నిర్వహించిన బహిరంగసభ బందోబస్తు స్వయంగా పర్యవేక్షించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.
*గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 25.12.2025* _*// “సుపరిపాలన దినోత్సవం” సందర్భంగా...
By KOTESWARARAO KVSR 2025-12-25 12:21:38 0 255
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com