75 ఏళ్ల నిరీక్షణకు తెర.. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు, ఏప్రిల్ 13న ప్రారంభం,

0
164

జిల్లా ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. జిల్లా చరిత్రలోనే 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభం కానుంది.

విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇది మనందరికీ గర్వకారణమంటూ అచ్చెన్నాయుడు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం 17439/40 హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి ఈ రైలు సర్వీసును ప్రారంభించనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

 

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను గుర్తించి, ప్రత్యేక చొరవ చూపించి రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ఈ రైలు సర్వీసు మంజూరులో కీలక పాత్ర పోషించినందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు.. అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పథంలో ఇదొక చరిత్రాత్మక ఘట్టంగా అచ్చెన్నాయుడు అభివర్ణించారు. మరోవైపు తిరుపతి - శ్రీకాకుళం రోడ్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు (17439) ప్రతి ఆదివారం తిరుపతి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయల్దేరుతుంది. సోమవారల మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. ఇక శ్రీకాకుళం - తిరుపతి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (17440) ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రైల్వే్ స్టేషన్‌ నుంచి బయల్దేరుతుంది. మంగళవారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది

.

 

References

Search
Categories
Read More
Punjab
The Digital Mandi: Revolutionizing Wheat Procurement
Punjab’s "Digital Mandi 2.0" platform hit a record today, processing 500,000 metric tons of...
By Dunna Jessicaruth 2026-05-14 08:28:06 0 36
Andhra Pradesh
Nara Lokesh: విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్ విధానంపై కీలక ఆదేశాలు.
      Nara Lokesh: విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్...
By Pagadala Venkateswar 2026-04-02 06:11:16 0 110
Andhra Pradesh
మదనపల్లెలో ఘనంగా హనుమాన్ జయంతి, ప్రముఖుల హాజరు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి...
By Pagadala Venkateswar 2026-05-13 05:35:57 0 44
Media Academy
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed Becoming A Journalist...
By Media Academy 2025-04-28 19:08:32 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com