Jagan Mohan Reddy: జగన్ గుంటూరు పర్యటన... పలువురు నేతలపై కేసులు నమోదు.

0
49

గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్

జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు నిర్వహించిన పలువురు వైసీపీ నేతలు

ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ కేసులు నమోదు

అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత చేపట్టిన గుంటూరు పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు హల్ చల్ చేశారు. పోలీసు యాక్ట్ 30ను పట్టించుకోకుండా అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... నల్లపాడులో పోతిన మహేశ్, బలసాని కిరణ్ కుమార్ పై కేసు నమోదయింది. మంగళగిరిలో నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, తాడేపల్లిలో దొంతిరెడ్డి వేమారెడ్డిపై, నగరంపాలెం ప్రాంతంలో పానుగంటి చైతన్య, నూరి ఫాతిమా, గుంటూరు పట్టాభిపురంలో అంబటి మురళిపై కేసులు నమోదయ్యాయి. 

 

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ... వైసీపీ నేతలు చేపట్టిన ర్యాలీల కారణంగా గుంటూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘించడం, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ క్రమంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Search
Categories
Read More
Telangana
కిషన్ ప్రసాద్ కాలనీకి శాశ్వత పరిష్కారం - శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో గల కిషన్ ప్రసాద్ కాలనీలో జరుగుతున్న...
By Sidhu Maroju 2026-02-04 09:43:16 0 44
Andhra Pradesh
పిల్లల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం !! కర్నూలు ఎంపి!!
కర్నూలు : రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి...
By Hari Krishna 2025-12-21 09:51:26 0 97
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త
రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జనవరి 2వతేది నుండి 9వరకు  పంపిణీ చేయాలని చంద్రబాబు...
By Karapati Gopi 2025-12-28 05:20:15 0 551
Andhra Pradesh
TDP మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్   టిడిపి...
By Rajini Kumari 2025-12-23 10:27:53 0 101
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com