దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.|

0
138

*_నేటి తరానికి దీక్షా దివాస్ 

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ లోని తెలంగాణ భవన్ లో ఈనెల 29వ తేదీన నిర్వహించనున్న దీక్షా దివాస్ కార్యక్రమ విజయవంతంపై జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజు అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ తో పాటుగా మాజీ మంత్రి & ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి , ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు , మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి,  పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి  హాజరై దీక్షా దివాస్ కార్యక్రమ నిర్వహణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....

నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్షత తొలగాలంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మార్గమని గుర్తించి తెలంగాణ రాష్ట్ర సాధనకై బిఆర్ఎస్ అధినేత,  కేసీఆర్  ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన 29, నవంబర్ 2009 రోజు "దీక్షా దివాస్" అని అన్నారు.

ఇంతటి ప్రాముఖ్యత ఉన్న "దీక్షా దివాస్" ప్రాముఖ్యతను నాయకులు, కార్యకర్తలు నేటి తరానికి తెలియజేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఎవరి బిక్షో కాదని, అమరవీరుల త్యాగం, కేసీఆర్ గారి మొక్కవోని దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మరియు జీహెచ్ఎంసీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
సింగల్ విండో అధ్యక్షునిగా దానమయ్య
గూడూరు మండల సింగల్ విండో అధ్యక్షులుగా గూడూరు ప్రముఖ టిడిపి నేత స్వర్గీయ బి కరుణాకర్ రాజు తండ్రి...
By mahaboob basha 2025-06-29 11:39:15 0 1K
Andhra Pradesh
సెయింట్ మార్క్స్ సెంటెనరీ లూథరన్ చర్చిలో  నిర్వహించిన ప్రత్యేక క్రిస్మస్ వేడుకల్లో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు సతీమణి శిరీష కుమారి గారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
చీరాల: యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని  సెయింట్ మార్క్స్ సెంటెనరీ...
By Gadiyapudi Narendra 2025-12-26 14:46:37 0 191
Andhra Pradesh
ముగతి గ్రామంలో పసుల ఆసుపత్రి తనిఖీలు చేసిన అధికారులు.
నందవరం మండల కేంద్రంలోని ముగతి గ్రామంలో పసుల ఆసుపత్రి అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ఆసుపత్రిలో...
By Boya Dasthagiri 2026-04-16 07:45:57 0 132
Andhra Pradesh
సాకారమైన సొంతింటి కల – మదనపల్లిలో ఘనంగా గృహప్రవేశాలు.
మదనపల్లి మండలం కోళ్ల బైలు పంచాయతీ హౌసింగ్ లేఅవుట్‌లో సోమవారం గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా...
By Pagadala Venkateswar 2026-03-31 03:30:10 0 116
Andhra Pradesh
మదనపల్లె బాలిక హత్య కేసు –రేపిస్ట్ మృతదేహం చెత్తకుప్పలో ఖననం.
మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్ మృతదేహాన్ని తల్లిదండ్రులు, బంధువులు...
By Pagadala Venkateswar 2026-02-20 08:41:57 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com