Ambati Rambabu: ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు.

0
109

Andhra

Ambati Rambabu Files 7 Quash Petitions in AP High Court

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై 7 కేసులు నమోదు

 

అన్ని కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు వేసిన అంబటి

నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 11కు వాయిదా వేసిన హైకోర్టు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆయనపై పట్టాభిపురం, మంగళగిరి, నగరంపాలెం, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. 

 

ఇప్పటికే నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్ పై విచారణను ఈ నెల 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మంగళగిరి పీఎస్ లో నమోదైన కేసులో తప్పనిసరిగా బీఎన్ఎస్ 35(3)ను అనుసరించాలని మంగళగిరి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

 

మిగిలిన 5 కేసులకు సంబంధించిన క్వాష్ పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్వాష్ పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

 

మరోవైపు, అంబటిపై పీటీ వారెంట్ పొందేందుకు మంగళగిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా ఉప కలెక్టర్ గారికి ఓ పాస్టర్ వేడు కోలు
విశాఖ పట్నం మధుర వాడ లో నివాసం ఉండే రత్న కుమారి సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్య క్రమం లో జిల్లా ఉప...
By Mobbu Venkatramana 2026-03-31 16:25:33 0 210
Andhra Pradesh
చీరాల క్లాక్ టవర్ సెంటర్ లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల...
చీరాల: ఇతర పార్టీలు బీసీలను కరివేపాకుల మాదిరి తీసేస్తే వారిని తులసి దళాలుగా మార్చిన ఘనత టిడిపి...
By Gadiyapudi Narendra 2026-01-23 16:11:35 0 186
Telangana
ఘనంగా బీర్ల శంకర్ జన్మదిన వేడుకలు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 14  ఈరోజు కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు సర్పంచ్ల ఫోరం...
By Pindikura Mahesh 2026-05-14 18:08:04 0 69
Telangana
అర్హులైన పేదలందరికీ న్యాయం చేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు...
వెలుగుమట్ల భూముల వ్యవహారంలో అర్హులైన పేదలెవరైనా సరే, వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని మంత్రి...
By Krishna Balina 2026-03-28 14:30:17 0 215
Andhra Pradesh
మదనపల్లి లో శ్రీవారి బస్సు ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాల్మీకి వీధికి చెందిన రైతు లక్ష్మీనారాయణ...
By Pagadala Venkateswar 2026-02-27 07:12:00 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com