Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి.

0
87

Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి

06-02-2026 Fri 18:16 | Andhra

 

Jagans Visit Turns Tragic YSRCP Leader Dies Near Jogi Ramesh House

జగన్ పర్యటన నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి వస్తున్న వైసీపీ నేత

పల్స్ పడిపోయి కుప్పకూలిన వైసీపీ నేత రాంబాబు

కాసేపటి క్రితం జోగి రమేశ్ ఇంటికి చేరుకున్న జగన్

వైసీపీ అధినేత జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్ ను పరామర్శించేందుకు ఆయన తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకు బయల్దేరారు. ఈ క్రమంలో జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి చెందారు. జగన్ వస్తున్న నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి వెళుతున్న చిల్లకల్లు గ్రామ వైసీపీ అధ్యక్షుడు డి.రాంబాబు పల్స్ పడిపోయి కుప్పకూలారు. వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 

 

మరోవైపు కాసేపటి క్రితం జోగి రమేశ్ ఇంటికి జగన్ చేరుకున్నారు. ఆయన ఇంటిని పరిశీలించి, కుటుంబ సభ్యలను పరామర్శించారు. 

 

జగన్ పర్యటన సందర్భంగా ఓ కుర్రాడు కూడా మరణించినట్టు తెలుస్తోంది. బైక్ పై విన్యాసాలు చేస్తూ బార్ గేట్ ను ఢీకొనడంతో అతడు మృత్యువాతపడినట్టు సమాచారం. మృతిచెందిన కుర్రాడిని ఇబ్రహీంపట్నంకు చెందిన భార్గవ్ గా గుర్తించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పేకాట స్థావరం పై దాడి
బుధవారం ఈపురుపాలెం  పోలీస్ స్టేషన్ పరిధిలో నక్కల వారి పాలెం నందు జరుగుచున్న పేకాట స్థావరం పై...
By Vadlamudi NagaVenkat 2026-03-18 14:33:54 0 676
Telangana
రోడ్డులు తవ్వి వదిలేసిన అధికారులు
Old city Rashapuram colony lo GHMC Adikarulu Abhivudi panulo bhagamga roads thavaru dinitho atuga...
By Poloju Bhaskar 2026-03-09 04:20:18 0 141
Andhra Pradesh
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By Rajini Kumari 2026-02-10 10:33:07 0 165
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com