Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి.

0
35

Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి

06-02-2026 Fri 18:16 | Andhra

 

Jagans Visit Turns Tragic YSRCP Leader Dies Near Jogi Ramesh House

జగన్ పర్యటన నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి వస్తున్న వైసీపీ నేత

పల్స్ పడిపోయి కుప్పకూలిన వైసీపీ నేత రాంబాబు

కాసేపటి క్రితం జోగి రమేశ్ ఇంటికి చేరుకున్న జగన్

వైసీపీ అధినేత జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్ ను పరామర్శించేందుకు ఆయన తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకు బయల్దేరారు. ఈ క్రమంలో జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి చెందారు. జగన్ వస్తున్న నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి వెళుతున్న చిల్లకల్లు గ్రామ వైసీపీ అధ్యక్షుడు డి.రాంబాబు పల్స్ పడిపోయి కుప్పకూలారు. వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 

 

మరోవైపు కాసేపటి క్రితం జోగి రమేశ్ ఇంటికి జగన్ చేరుకున్నారు. ఆయన ఇంటిని పరిశీలించి, కుటుంబ సభ్యలను పరామర్శించారు. 

 

జగన్ పర్యటన సందర్భంగా ఓ కుర్రాడు కూడా మరణించినట్టు తెలుస్తోంది. బైక్ పై విన్యాసాలు చేస్తూ బార్ గేట్ ను ఢీకొనడంతో అతడు మృత్యువాతపడినట్టు సమాచారం. మృతిచెందిన కుర్రాడిని ఇబ్రహీంపట్నంకు చెందిన భార్గవ్ గా గుర్తించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు.
మదనపల్లె మార్కెట్ కు రైతులు టమాటాలు తీసుకురావడం మానేశారు. ఇతర రాష్ట్రాలలోనూ పంటలు ఉండటంతో రేట్లు...
By Pagadala Venkateswar 2026-02-16 05:02:45 0 27
Andhra Pradesh
AP TET-2025: ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షా ఫలితాలను శుక్రవారం నాడు మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. తన...
By Pagadala Venkateswar 2026-01-09 14:49:33 0 89
Andhra Pradesh
లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) శ్రీ బి. ఉమామహేశ్వర్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు
బాపట్ల: లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు...
By Gadiyapudi Narendra 2025-12-26 14:38:26 0 136
Andhra Pradesh
చేర్చి పాస్టర్ కు15000 రూపాయలు స్పీకర్లకు పంపిణీ
చర్చి పాస్టర్లకు15000 రూపాయలు స్పీకర్లకు పంపిణీ   మండల కేంద్రంలోని పాస్టర్ డి యోబు...
By Chennaiah Kati 2026-02-01 15:18:28 0 93
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com