ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

0
39

*ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయండి* 

 

 *సమ్మె జయప్రదం కొరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన గుంటూరుజిల్లా జీపు జాత శుక్రవారం నాడు రాజధాని లోని ఎర్రబాలెం వచ్చిన సందర్భంగా స్వాగతం పలుకుతున్న సిఐటియు నేతలు, మున్సిపల్ కార్మికులు*

*

*రాజధాని లోని ఎర్రబాలెంలో మాట్లాడుతున్న* *సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి* 

*జి. రమణ*

 

*లేబర్ కోడులను రద్దు చేయాలి*

 

*సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి* 

*జి.రమణ డిమాండ్* 

*

ఈ సందర్భంగా సిఐటియు రాజధాని డివిజన్ నాయకులు ఎం రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి జి. రమణ మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు 

 

స్వతంత్రం వచ్చిన నాటినుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తొలగించి వాటి స్థానంలో కార్పొరేట్లకు వత్తాసుగా నాలుగు లేబర్ కోడులను తీసుకువచ్చిందని 

ఇవి అమలు జరిగితే కార్మికులు కట్టు బానిసలుగా మారతారని సాధించుకున్న హక్కులన్నీ కోల్పోతారని అన్నారు 

 

కార్మిక వర్గానికి ఉరి తాళ్లుగా మారే లేబర్ కోడులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తక్షణం ఉపసంహరించు

కోవాలని రమణ డిమాండ్ చేశారు 

 

కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు 

 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పని గంటల పెంపు, మహిళలతో రాత్రిపూట డ్యూటీలు చేపించాలనె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు 

 

కార్మిక వ్యతిరేక విధానాలను పాలకులు విడనాడకపోతే కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని రమణ హెచ్చరించారు 

 

ఏఐటి యుసి గుంటూరు జిల్లా అధ్యక్షులు

 ఏ అరుణ్ కుమార్ మాట్లాడుతూ 

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు 

 

ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు

 

ఈ కార్యక్రమంలో సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు 

బి లక్ష్మణరావు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాజధాని ప్రాంత నాయకులు ఆదిలక్ష్మి ఎం పార్వతి చిన్న శ్రీను కొండలు శ్రీలక్ష్మి రమాదేవి ఎస్కే సుభాని గాంధీ కోటేశ్వరరావు తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలసిన టీడీపీ రాష్ట నాయకురాలు వైకుంఠం జ్యోతి*
కర్నూల్ జిల్లా ఎస్పీ ని కర్నూల్ నందు మర్యాదపూర్వకంగా కలసి శాంతి భద్రతల గురించి చర్చించారు ఈ...
By mahaboob basha 2025-06-14 15:14:43 0 1K
Telangana
జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-07-14 12:47:11 0 1K
Sikkim
Final Railway Survey Approved for Melli–Dentam Line in Sikkim
The Ministry of Railways has approved the final location survey for a proposed Melli-to-Dentam...
By Bharat Aawaz 2025-07-17 07:29:54 0 1K
Andhra Pradesh
కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ప్రారంభం :
కర్నూలు సిటీ :  కలెక్టర్ కార్యాలయంలో  స్పెషల్ కంట్రోల్ రూమ్  నూతన గదిని...
By Hari Krishna 2025-12-31 11:29:48 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com