Pawan Kalyan: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు: పవన్ కల్యాణ్.

0
124

గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు

తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు పామాయిల్, రసాయనాలు వాడారని వ్యాఖ్య

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కూడా లక్ష కల్తీ లడ్డూలు పంపారని ఆరోపణ

గత ప్రభుత్వం దేవుడిపైనే పగబట్టిందని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శ

ఈ వ్యవహారంలో ఎక్కడా సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని, వాస్తవాలు బయటపెడతామని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, ఇందులో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు తమ యుద్ధం ఆగదని హెచ్చరించారు.

 

నెయ్యి పేరుతో పామాయిల్, ప్రమాదకరమైన రసాయనాలు వాడి భక్తుల మనోభావాలను, ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంపై మాట్లాడేటప్పుడు తాము అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇవాళ ఉండవల్లిలో కూటమి నేతల సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడారు.

Search
Categories
Read More
Sports
UEFA Europa League Final Takes Center Stage Tonight
The European football spotlight shines bright tonight as the 2026 UEFA Europa League Final kicks...
By Dunna Jessicaruth 2026-05-20 05:29:43 0 24
Andhra Pradesh
Chandrababu Naidu: టీడీపీ వర్క్‌షాప్‌... కార్యకర్తల మధ్యలో కూర్చున్న చంద్రబాబు.
టీడీపీ పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయకులతో కలిసి...
By Pagadala Venkateswar 2026-01-28 07:56:19 0 110
Andhra Pradesh
మదనపల్లెలో రూ. 5 కోట్ల ఆలయ భూమి కబ్జా.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు.
మదనపల్లె పట్టణంలోని మడికయల శివాలయానికి చెందిన సుమారు 5 కోట్ల రూపాయల విలువైన 41 సెంట్ల భూమిని...
By Pagadala Venkateswar 2026-03-16 10:09:19 0 123
Gujarat
Revolutionizing Transit: The ₹20,667 Crore Dholera Rail Link
Gujarat is set to become a global logistics powerhouse following the Union Cabinet’s...
By Dunna Jessicaruth 2026-05-15 04:50:29 0 45
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు...
By Kothuru Murali 2026-03-05 05:16:57 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com