జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.

0
128
బాపట్ల జిల్లా: పర్యావరణం పరిరక్షణలో భాగంగా పట్టణ ప్రాంతాలలో వెలువడే చెత్త, మురుగును పద్ధతి ప్రకారం తొలగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.
ఘన వ్యర్థాలు నిర్వహణ, తొలగింపుపై మునిసిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. పర్యావరణ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తతో పర్యావరణానికి హాని, అనర్థాలను కలిగించే అంశాలను అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. మురుగునీటి నిర్వహణ విషయంలో అధికారులు అలసత్వం ఉండరాదన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్త, ఘన వ్యర్ధాల సేకరణ జరగాలన్నారు. చెత్త, ఘన వ్యర్ధాల విభజన నిబంధనలనుసరించి చేపట్టాలన్నారు. ఘన వ్యర్ధాలు పర్యావరణానికి హాని కలిగించకుండా ప్రాసెసింగ్ యూనిట్లకు పంపే అంశాలపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చీరాల పట్టణం నుంచి 35.7 టన్నుల చెత్త తొలగింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేకరించిన ఘన వ్యర్థాలను జిందాల్ ఫ్యాక్టరీకి పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంతో అధికారులు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. మురుగునీటిని పద్ధతి ప్రకారం పట్టణం నుంచి దిగువ ప్రాంతాలకు మళ్లించడం, బయటకు పంపడం, శుద్ధి చేసే యూనిట్ లను విస్తరింప చేయాలన్నారు.
ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, కమిటీ సభ్యులైన కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, ప్రజారోగ్య శాఖ అధికారులు, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు, తదితరులు పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Telangana
శ్రీ మణికంఠ మహాపాదయాత్ర క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రతి  సంవత్సరము ఉగాది పండుగా రోజున శ్రీ మణికంఠ మహాపాదయరత్ర వారు వారు ప్రతి సంవత్సరం...
By Poloju Bhaskar 2026-03-19 10:57:25 0 138
Andhra Pradesh
మదనపల్లె: సైబర్ మోసాల అడ్డాగా మార్చుకున్న కేటుగాళ్లు.
మదనపల్లె కేంద్రంగా జరుగుతున్న సైబర్ మోసాలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం...
By Pagadala Venkateswar 2026-03-05 03:44:21 0 75
Andhra Pradesh
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*అనకాపల్లి*   • స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Rajini Kumari 2025-12-20 13:18:10 0 132
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com