శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ - చినరాయుని చెరువుకు గుర్రపు డెక్క విముక్తి.|

0
160

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని చినరాయుని చెరువు ప్రక్షాళనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గత కొన్ని రోజులుగా అధికారులపై ఒత్తిడి తెస్తూ.. నిరంతరం ఫాలో అప్ చేయడంతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గుడ్లపుడెక్క తొలిగింపు పనులు ఈరోజు లాంచనంగా ప్రారంభమయ్యాయి.

 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు. వారితోపాటు ఎస్ డబ్ల్యూ మేనేజ్మెంట్ డిఇ. సత్యనారాయణ, ఏ.ఇ. సమీర్, ఎంటమాలజీ ఏఇ. అనిల్, ఎస్ ఎఫ్ ఏ వెంకట్రామిరెడ్డి, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

 

స్థానిక కాలనీలో ప్రజలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చి, కార్పోరేటర్ చేసిన కృషిని అభినందించారు.

 

చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరగడం వల్ల దోమల ఉధృతి పెరిగి, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రజారోగ్యానికి ముప్పుగా మారిందని కార్పొరేటర్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.

 

నీటి ప్రవాహాన్ని మెరుగుపరచడం, మరియు పారిశుద్ధాన్ని కాపాడడం ద్వారా పరిసర ప్రాంతాల ప్రజలకు ఊరట లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

 

పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా వేగవంతంగా పూర్తి చేసి చెరువును పూర్తిస్థాయిలో గుర్రపు డెక్క రహితంగా తీర్చిదిద్దాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

 

దీనికి అధికారులు స్పందిస్తూ.. అవసరమైన యంత్రాలను మొహరించి వీలైనంత త్వరగా ప్రక్షాళన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

 

స్థానిక సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుంటున్న కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డికి, సమీప కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలిపారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు.
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ...
By Gadiyapudi Narendra 2025-12-30 11:24:43 0 380
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: క్షుద్ర పూజలతో అదిరిపడ్డ ప్రజలు
శుక్రవారం, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఆమినిగుంట గ్రామ సమీపంలో పులికోన వద్ద క్షుద్ర...
By Kothuru Murali 2026-02-28 12:57:30 0 90
Andhra Pradesh
శ్రీరామనవమి: మదనపల్లెలో అన్నదానం, పానకం పంపిణీ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం లైఫ్ కేర్ రాజశేఖర్...
By Pagadala Venkateswar 2026-03-27 08:49:21 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com