శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ - చినరాయుని చెరువుకు గుర్రపు డెక్క విముక్తి.|

0
194

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని చినరాయుని చెరువు ప్రక్షాళనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గత కొన్ని రోజులుగా అధికారులపై ఒత్తిడి తెస్తూ.. నిరంతరం ఫాలో అప్ చేయడంతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గుడ్లపుడెక్క తొలిగింపు పనులు ఈరోజు లాంచనంగా ప్రారంభమయ్యాయి.

 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు. వారితోపాటు ఎస్ డబ్ల్యూ మేనేజ్మెంట్ డిఇ. సత్యనారాయణ, ఏ.ఇ. సమీర్, ఎంటమాలజీ ఏఇ. అనిల్, ఎస్ ఎఫ్ ఏ వెంకట్రామిరెడ్డి, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

 

స్థానిక కాలనీలో ప్రజలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చి, కార్పోరేటర్ చేసిన కృషిని అభినందించారు.

 

చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరగడం వల్ల దోమల ఉధృతి పెరిగి, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రజారోగ్యానికి ముప్పుగా మారిందని కార్పొరేటర్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.

 

నీటి ప్రవాహాన్ని మెరుగుపరచడం, మరియు పారిశుద్ధాన్ని కాపాడడం ద్వారా పరిసర ప్రాంతాల ప్రజలకు ఊరట లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

 

పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా వేగవంతంగా పూర్తి చేసి చెరువును పూర్తిస్థాయిలో గుర్రపు డెక్క రహితంగా తీర్చిదిద్దాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

 

దీనికి అధికారులు స్పందిస్తూ.. అవసరమైన యంత్రాలను మొహరించి వీలైనంత త్వరగా ప్రక్షాళన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

 

స్థానిక సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుంటున్న కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డికి, సమీప కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలిపారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరులో ట్రాఫిక్ నిబంధనలపై భారీ అవగాహన ర్యాలీ – ఈస్ట్ ట్రాఫిక్ సిఐ ఎ. అశోక్ కుమార్
గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మరియు ట్రాఫిక్ డి.ఎస్.పి , బెల్లం శ్రీనివాసరావు...
By John Baji 2025-12-24 16:04:51 0 368
Telangana
పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
చిలుకూరు మండల బేతవోలు గ్రామo సబ్ స్టేషన్ పరిధిలో 21.05.2026 నా చేన్నారి గూడెం, ఆచర్లగూడెం,...
By Nookapangu Manikanta 2026-05-20 12:26:26 0 176
Telangana
250 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన hydra
-రూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన‌ హైడ్రా -2.34 ఎక‌రాల ప్ర‌భుత్వ బూమి చుట్టూ...
By Nagula Swamy 2026-03-16 10:24:14 0 433
Andhra Pradesh
తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ
తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి.‌ఈ యునిట్...
By Karapati Gopi 2026-06-24 12:54:55 0 171
Andhra Pradesh
2025 లో సామాన్యుడిపై ప్రభావం చూపిన ఆర్థిక మార్పులు ఇవే
*2025లో సామాన్యుడి జేబుపై ప్రభావం చూపిన ఆర్థిక మార్పులు ఇవే*   2025లో చాలా ఆర్థిక మార్పులు...
By Rajini Kumari 2025-12-29 13:07:22 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com