చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతల స్వీకారం

0
159
చీరాల: చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అద్దంకి పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై చీరాలకు వచ్చిన ఆయన అధికారికంగా విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా ఎస్సై పి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, చీరాల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని, నేర నియంత్రణకు పోలీస్ శాఖలోని అన్ని విభాగాలతో సమన్వయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
అలాగే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, బాధితులకు తగిన న్యాయం చేకూర్చడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చట్ట పరిరక్షణలో రాజీ లేకుండా విధులు నిర్వహిస్తానని, ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు.
 
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టరేట్ వద్ద పోలీసుల తీరుపై సిపిఎం ఆగ్రహం.
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి కలెక్టరేట్ కు...
By Pagadala Venkateswar 2026-02-28 06:40:53 0 104
Andhra Pradesh
ఏపీలో విభిన్న వాతావరణం.. కోస్తాలో వానలు, సీమలో భగభగలు.
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు రాయలసీమలో ఎండలు...
By Pagadala Venkateswar 2026-04-09 04:48:21 0 106
Telangana
అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో  భారత్ ఘన విజయం..
  భారత జట్టు ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. శుక్రవారం ఇంగ్లాండ్‌పై...
By Yadamma Raju Gajapaga 2026-02-06 15:02:30 0 320
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com