రహదారుల రూపకల్పనకు నిర్మాణాత్మకమైన కృషి.-బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు వెల్లడి

0
232

బాపట్ల నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలకు మహర్దశ కలిగింది. శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు సూచన మేరకు ప్రధాన రహదారులకు నిధులు కేటాయించారు. కర్లపాలెం మండలం పేరలి గ్రామం నుండి తుమ్మలపల్లి వయా పెర్లమ్మ ఆలయ వరకు రహదారి నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు పడుతున్న ఆందోళన పై స్పందించిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు చేసిన కృషి ఫలితంగా ఒక చక్కటి రహదారికి మార్గం సుగమం అయింది. బాపట్ల మండలం పూండ్ల రహదారి నుండి మర్రిపూడి మాలపల్లి వరకు 81 ఒక్క లక్షల రూపాయలతో రహదారి నిర్మించనున్నారు. నిధులను మంజూరు చేయటంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కృతజ్ఞతలు తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో అనేక రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గుర్తు చేశారు. తిరిగి మరో రెండు రోడ్లకు నిధులు మంజూరు అయ్యాయని వెల్లడించారు. నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి అమలుకు నోచుకొని రహదారులకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకొని అందమైన రహదారులకు రూపకల్పన చేస్తామని చెప్పారు. మరికొన్ని రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు చేసి ఉన్నామని వెల్లడించారు. త్వరలోనే ఆయా నిధులు మంజూరు అవుతాయని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చెప్పారు. గుంతలు లేని రహదారులు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో అనేక రహదారుల పరిస్థితిపై నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో రహదారులను కలిపే అనుసంధాన రోడ్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు వెల్లడించారు

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రామ పంచాయతీలకు చెత్త ఆటోలను అందజేసిన రెవెన్యూ అధికారి ఏం లక్ష్మీ నరసింహం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ
*ఎన్టీఆర్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి నుంచి తడి చెత్త - పొడి...
By Rajini Kumari 2025-12-16 07:25:32 0 143
Andhra Pradesh
రోడ్డు భద్రతలపై ప్రజలకు అవగాహన : కర్నూలు జిల్లా పోలీసులు
కర్నూలు : కర్నూలు జిల్లారహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం ...కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ...
By Hari Krishna 2026-01-17 17:11:36 0 110
Andhra Pradesh
Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు.
రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణే ప్రధాన అజెండా అమరావతి, విభజన హామీలపై చర్చించే అవకాశం ఐటీ,...
By Pagadala Venkateswar 2026-02-04 08:01:41 0 99
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం యడవల్లి గ్రామంలో ఇరువర్గాలు మధ్య పోరు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం యడవల్లి గ్రామంలో రెండు వర్గాల పోరు మధ్య గొడవ దోర్నాల యడవల్లి...
By Chennaiah Kati 2026-01-02 05:53:19 0 333
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com