ఏసీబీ మెరుపు దాడి 15 లక్షల లంచం నొక్కుతూ అడ్డంగా దొరికిన SE. చిన్నారెడ్డి .|

0
134

హైదరాబాద్ : అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ ఏసీబీ మరోమారు వణుకు పుట్టించింది. కూకట్ పల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో తిష్ట వేసిన ఒక అవినీతి తిమింగలం నేడు అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది. 

ఒక కాంట్రాక్టర్ నుండి ఏకంగా 15 లక్షల నగదును లంచంగా తీసుకుంటూ కూకట్ పల్లి జోనల్ సూపర్ ఇండెంట్ ఇంజనీర్ (SE) చిన్నారెడ్డి పట్టుబడ్డాడు.

 

వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లి జోన్ పరిధిలో పనులు పూర్తిచేసిన ఓ కాంట్రాక్టర్ కు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి ఎస్.ఈ చిన్నారెడ్డి భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడు 

 

లంచం ఇస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతాయని ఖరాఖండిగా చెప్పడంతో, భాదితుడు చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించాడు. 

అధికారుల వ్యూహం ప్రకారం, నేడు కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా ఏసీబీ బృందం ఆయన్ని చుట్టుముట్టింది. 

 

రసాయనాలు పూసిన నోట్లను చిన్నారెడ్డి తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

 

చిన్నారెడ్డిని అదుపులోకి తీసుకున్న అనంతరం, ఆయన కార్యాలయం తో పాటు, ఆయన నివాసంలోను ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోధాలు నిర్వహిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడా! అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు.

 

 

కూకట్ పల్లి జిహెచ్ఎంసి విభాగంలో ఇంతటి భారీ అవినీతి బయటపడడం నగరవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

 

ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలతో ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారా! అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో చిన్నారెడ్డి పై అవినీతి ఆరోపణలు వచ్చినట్టు సమాచారం.

 

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
దేశ భవిష్యత్తు నిర్ణయంలో యువత పాత్ర కీలకం.
అన్నమయ్య జిల్లా జేసీ శివ నారాయణ శర్మ ఆదివారం మదనపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-01-25 12:44:26 0 142
Andhra Pradesh
test
test
By Hazu MD. 2026-03-23 11:00:13 0 307
Assam
PM Modi Inaugurates ₹5,000 Cr Bamboo Ethanol Plant in Assam |
Prime Minister Narendra Modi inaugurated a ₹5,000 crore bamboo-based ethanol plant in Numaligarh,...
By Pooja Patil 2025-09-16 10:07:06 0 683
Andhra Pradesh
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు...
By Pagadala Venkateswar 2026-02-14 12:33:54 0 112
Andhra Pradesh
కురబలకోట: ఇంటి పత్రాలు లాక్కుని తల్లిని గెంటేసిన కొడుకు.
కురబలకోట మండలం కనసానవారిపల్లికి చెందిన కొండమ్మ, సోమవారం మదనపల్లిలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు...
By Pagadala Venkateswar 2026-03-03 02:53:01 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com