Visakhapatnam Steel Plant: నష్టాల నుంచి లాభాల బాట పట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్... సీఎం చంద్రబాబు స్పందన.

0
40

రికార్డు స్థాయిలో 94 శాతానికి చేరిన ఉత్పత్తి సామర్థ్యం

 

రూ.54 కోట్ల లాభం సాధించిన ఆర్ఐఎన్ఎల్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అనూహ్య ప్రగతి

విశాఖ ఉక్కుకు పూర్తి సహకారం అందిస్తామన్న సీఎం చంద్రబాబు

ఒకప్పుడు తీవ్ర నష్టాలతో మూసివేత అంచులకు చేరిన విశాఖ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) మళ్లీ లాభాల బాట పట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేవలం ఏడాదిన్నర కాలంలోనే అనూహ్య ప్రగతి సాధించి, ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు సచివాలయంలో విశాఖ ఉక్కు పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

 

ఈ సమీక్షలో అధికారులు ప్లాంట్ పనితీరును సీఎంకు వివరించారు. 2024-25 రెండో త్రైమాసికంలో రోజుకు కేవలం 9,215 టన్నులుగా ఉన్న ఉక్కు ఉత్పత్తి, ప్రస్తుతం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తుండటంతో రోజుకు 19,401 టన్నులకు చేరిందని తెలిపారు. దీంతో ప్లాంట్ సామర్థ్య వినియోగం 45 శాతం నుంచి రికార్డు స్థాయిలో 94 శాతానికి పెరిగింది. ఈ ప్రగతి ఆర్థిక ఫలితాల్లోనూ స్పష్టంగా కనిపించింది. 2024 సెప్టెంబర్‌లో రూ.486 కోట్ల నష్టాన్ని నమోదు చేసిన ఆర్ఐఎన్ఎల్, 2026 జనవరి నాటికి రూ.54 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

 

కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.11,000 కోట్ల ఆర్థిక సహాయం ప్లాంట్‌ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని, దీంతో సంస్థ క్రెడిట్ రేటింగ్ కూడా మెరుగుపడిందని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. యాజమాన్యం, కార్మికులు, ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి విశాఖ ఉక్కును మరింతగా విజయపథంలో నడపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

 

ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విశాఖ లో డిప్యూటీ సిఎం పర్యటన
విశాఖ పట్నం జిల్లాలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మూడు రోజుల వరకు పర్యటిస్తారు. ఇప్పటికే గురు వారం...
By Mobbu Venkatramana 2026-01-30 17:21:07 0 343
Karnataka
Sigandur Bridge Opens — Karnataka’s Longest Cable-Stayed Marvel
Karnataka celebrated the inauguration of its longest inland cable-stayed bridge, the 2.25 km...
By Bharat Aawaz 2025-07-17 06:43:51 0 2K
Telangana
ఆశాడమాస బోనాలు.. అమ్మ వార్లను దర్శించుకుని పూజలలో పాల్గొన్న బీజేపీ నాయకులు.
హైదరాబాద్/సికింద్రాబాద్. ఆషాడ మాస లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లోని చిలకలగూడ...
By Sidhu Maroju 2025-07-21 07:58:49 0 931
Andhra Pradesh
బర్ధన్ ఆశయాలను కొనసాగిద్దాం... జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి పిలుపు...
జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి, అమరజీవి కామ్రేడ్ ఏబీ బర్ధన్ 10వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు సిపిఐ నగర...
By John Baji 2026-01-03 02:13:37 0 97
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com