మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత

0
226

మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం వద్ద నామినేషన్ల ఉపసంహరణ గడువు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. 16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కృపానందాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యాలయానికి తీసుకెళ్లడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థిని బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసినా లోనికి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్. సెక్యురిటికౌన్సిల్ లో(మహిళాదినోస్తవం)
నిజామాబాద్. నగరంలోని విజయలక్ష్మి గార్డేన్ లో మహిళా దినోస్థవం సంధర్బంగా ఏర్పాటు చెసినా సమవేషంలోన్...
By Sadaq Sadaq 2026-03-06 18:25:26 0 142
Telangana
హాజీపూర్ ఒత్తిడిని జయించడానికి క్రీడలు సాధన చేయాలి
హాజీపూర్ ఒత్తిడిని జయించడానికి క్రీడలు సాధన చేయాలి జీవితంలో ఒత్తిడిని అధిగమించడానికి ప్రతిరోజు...
By Pinnehasan Odela 2026-04-09 14:29:18 0 120
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ 15-12-2025   ప్రచురణార్ధం   అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన...
By Rajini Kumari 2025-12-15 07:25:36 0 287
Telangana
ఆల్వాల్ పోలీస్, వైద్యశాఖ, సంయుక్త దాడులు : నకిలీ డాక్టర్ ల అరెస్ట్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఎటువంటి వైద్య...
By Sidhu Maroju 2026-02-06 16:54:26 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com