ప్రకాశం- పల్నాడు- బాపట్ల జిల్లాలో విద్యుత్- రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు - సుమారు 4 లక్షల 40 వేల విలువైన చోరీ సొత్తు రికవరీ.

0
208

ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల్లో విద్యుత్/రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు – సుమారు 4 లక్షల 40 వేల విలువైన చోరీ సొత్తు రికవరీ.

 బల్లికురవ పోలీసులు చాకచక్యంగా నిర్వహించిన ఆపరేషన్‌లో, ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల పరిధిలో గ్రానైట్ ఫ్యాక్టరీ లలో, పొలాల్లోని ట్రాన్స్-ఫార్మర్లు మరియు కాలేజీ బిల్డింగ్ లోని రాగివైర్లు దొంగిలించిన ఐదుగురు ముద్దాయిలను బల్లికురవ SI నాగరాజు బల్లికురవ పాత బస్టాండ్ వద్ద అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 4 లక్షల 40 వేల విలువైన రాగితీగను స్వాధీనపరచుకున్నారు.

 అరెస్టు అయిన ముద్దాయిల వివరాలు: 

1.కొమరగిరి ప్రసాద్ తండ్రి సుబ్బారావు, వయస్సు 21 సం’’లు, పిన్నివారిపాలెం గ్రామం, బాపట్ల మండల & జిల్లా, 

2.కాశిమళ్ళ శ్యాంబాబు తండ్రి ఏడుకొండలు, వయస్సు 22 సం’’లు,మిన్నికల్లు గ్రామం, సంతమాగులూరు మండలం, 

3.ఈగ లక్ష్మినారాయణ తండ్రి సుబ్బారావు, వయస్సు 21 సం’’లు, రామకృష్ణాపురం, బాపట్ల టౌన్,

 4.కల్లూరి ఏసోబు తండ్రి ప్రసాద్, వయస్సు 20 సం’’లు, కొత్త నందాయిపాలెం గ్రామం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా, 

5.రావినూతల రాజశేఖర్ @ విశాల్ తండ్రి డేవిడ్, వయస్సు 20 సం’’లు, నల్లమోతువారిపాలెం గ్రామం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా .                  

 చేదించిన కేసులు మరియు రికవరీ వివరాలు: 

బల్లికురవ మండల పరిధిలో నమోదైన 3 కేసుల్లో రాగితీగ ( 50 Kg);

 నరసరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో రాగితీగ( 30 Kg);

 అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో రాగితీగ( 20 Kg);

 బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో రాగితీగ;

–మొత్తం 6 కేసుల్లో 100 Kg ల రాగితీగ (సుమారు 4 లక్షల 40 వేల రూపాయల విలువ) రికవరీ చేయబడ్డాయి.

 ముద్దాయిల నేపథ్యం మరియు చోరీ విధానం: 

ఈ ఐదుగురు ముద్దాయిలు బాపట్ల జిల్లా కు చెందినవారు అయి ఉండి వృత్తిరీత్యా కూలిపనులు చేయడం వలన జీవనోపాధి. అయితే, చెడు వ్యసనాలకు బానిసలైన వీరు, తమ పని నుండి సరిపడా ఆదాయం రాకపోవడంతో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. గత రెండు నెలలుగా రాత్రి సమయాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ, రాగి వైర్లు దొంగిలించి, వాటిని అమ్ముకుని తమ చెడు వ్యసనాలను తీర్చుకునేందుకు ఈ దొంగతనాలను అలవాటు చేసుకున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ముద్దాయిలను గుర్తించి అరెస్టు చేయడం జరిగింది.

ఈ కేసు చేధనను స్వయంగా పర్యవేక్షించిన దర్శి DSP.బి.లక్ష్మినారాయణ, సంతమాగులూరు సిఐ కె,వెంకటరావు, బల్లికురవ SI వై.నాగరాజు మరియు వారి సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., గారు అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : తాళం వేసిన ఇంట్లో చోరీ
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లెలో శనివారం తెల్లవారుజామున తాళం...
By Kothuru Murali 2026-05-17 16:45:50 0 73
Telangana
నిజామాబాద్: ఏటెట పెరుగుతున్న కౌలు ధరలు
ఉమాడి  నిజామాబధ్ జిల్లాలో సగునిటి విప్లవం కౌలు ధరలాను పరుగులు పెటి సుతంధి.శ్రీరామసాగర్...
By Sadaq Sadaq 2026-05-26 07:30:36 0 89
Telangana
"సమ్మే హారన్ "స్తంభించిన చక్రం.. డిపోలకే బస్సులు!"
సికింద్రాబాద్  : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన...
By Sidhu Maroju 2026-04-22 03:55:01 0 298
Arunachal Pradesh
Border Infrastructure Development Driving Arunachal Growth
Border Infrastructure Development has become a key focus in Arunachal Pradesh, enhancing...
By Fathima Safa 2026-06-23 12:01:50 0 116
Telangana
నిజామాబాద్: తాటికొండ నరేష్ ను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరంలోని BRS పార్టీ 35వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ తాటికొండ నరేష్ గారి తండ్రి శ్రీ తాటికొండ...
By Sadaq Sadaq 2026-04-23 04:41:59 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com