46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన హోంగార్డ్‌ G.కృష్ణ కిషోర్ ను అభినందించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.

0
109

📍కేరళ రాష్ట్రం తిరువనంతపురం నగరంలోని చంద్రశేఖర్ నాయర్ స్టేడియంలో తేది. 28.01.2026 నుండి 01.02.2026 వరకు నిర్వహించిన 46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ – 2026లో గుంటూరు జిల్లా హోం గార్డ్ జి. కృష్ణ కిషోర్ పాల్గొని గణనీయమైన ప్రతిభను ప్రదర్శించారు.

📍ఈ పోటీలలో 30+ వయో వర్గం – 5 కిలోమీటర్ల రేస్ వాక్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన 00:32:40.2 సెకన్ల సమయంలో రేస్ పూర్తి చేసి రెండవ స్థానం సాధించి రజత పతకాన్ని గెలుచుకున్నారు.

🚩 ఈ సందర్భంగా ఈ రోజు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారిని హోంగార్డ్ జి. కృష్ణ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిసి, తాను పతకం సాధించిన విషయాన్ని ఎస్పీ గారికి తెలుపగా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు.

📍భవిష్యత్తులో జరగబోయే పోటీలలో మరిన్ని పతకాలు సాధించి గుంటూరు జిల్లా పేరు ప్రతిష్టలను మరింత ఉన్నతంగా నిలబెట్టాలని ఆకాంక్షించారు.

📍గుంటూరు జిల్లా పోలీస్ శాఖ తరఫున హోంగార్డ్ జి. కృష్ణ కిషోర్‌కు గౌరవ ఎస్పీ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

👉ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీ ఏ హనుమంతు గారు, హోమ్ గార్డు ఆర్ఐ రామకృష్ణ రెడ్డి గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి
భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్దేశిత...
By Pinnehasan Odela 2026-04-09 14:31:54 0 146
Andhra Pradesh
దుర్గ గుడికి మూడు గంటల పాటు విద్యుత్ నిలిపివేత అధికారుల నిర్లక్ష్య వైఖరి
దుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు...
By Rajini Kumari 2025-12-28 09:42:23 0 237
Andhra Pradesh
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి : ప్రత్తిపాటి
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి గుంటూరు మిర్చి యార్డ్ నూతన ఛైర్మన్ కు మాజీమంత్రి...
By Gadiyapudi Narendra 2025-12-27 16:11:37 0 352
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com