కూడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : కమిషనర్

0
223

కర్నూలు : 

కర్నూలు సిటీ : 

కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

➡️ నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

 

కర్నూలు నగరంలోని కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహన రాకపోకలు సులభతరం చేయడమే లక్ష్యంగా అవసరమైన ప్రాంతాల్లో కూడళ్ల ఏర్పాటు చేసి వాటిని ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన శివాజీ మహారాజ్ ఛత్రపతి (వై.జంక్షన్) కూడలిని పరిశీలించారు.

 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని కూడళ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడలిని రూ.54 లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 

 

  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు రమణ మూర్తి, డిసిపి వెంకటరమణ, డిఈఈ గిరిరాజ్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, టిఏఈ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉత్తరాంధ్రలో జోరుగా సంక్రాంతి సంబరాలు
ఈ రోజు సంక్రాంతి  పండుగ లో విశాఖ పట్నం .శ్రీకాకుళం.విజయ నగరం ఉమ్మడి జిల్లాలలో...
By Mobbu Venkatramana 2026-01-15 05:50:33 0 525
Telangana
క్రిస్మస్ వేడుకను పురస్కరించుకొని సర్వాంగ సుందరంగా చర్చ్ ల ముస్తాబు.|
సికింద్రాబాద్  : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని చర్చిలన్నీటిని...
By Sidhu Maroju 2025-12-24 10:13:47 0 146
Telangana
రైతు విశిష్ట గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ...జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల...
By Gangaram Rangagowni 2026-01-10 06:53:49 0 182
Andhra Pradesh
కళామందిర్ సిబ్బంది దాడి.. తల్లి, కొడుకుకు గాయాలు.
మదనపల్లె సిటిఎం మండలానికి చెందిన ముబారక్ భార్య నజీరా (40), ఆమె కొడుకు షఫీ (27)పై మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-03-10 04:33:28 0 76
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com