Pawan Kalyan: ప్రతిదానికీ నేనే స్పందిస్తుంటే మీరెందుకు ఉన్నట్టు?: జనసేన నేతలపై పవన్ కల్యాణ్ అసంతృప్తి!

0
153

అన్నింటికీ నేనే మాట్లాడాలా అంటూ నేతలపై పవన్ ఆగ్రహం

 

తిరుపతి లడ్డూ కల్తీపై వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆదేశం

వైసీపీ ట్రాప్‌లో పడొద్దు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

2026 స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని పిలుపు

కూటమిపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వద్దని సూచన

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ పార్టీ నాయకుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి అంశంపైనా తానే స్పందించాల్సి వస్తుంటే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మీరెందుకు ఉన్నట్టని మందలించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో ఆయన పార్టీ నాయకులకు కీలక దిశానిర్దేశం చేశారు.

 

ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు బలంగా తిప్పికొట్టడం లేదని పవన్ ప్రశ్నించారు. ఈ కల్తీ వెనుక వైసీపీ నేతలు, కొందరు అధికారుల పాత్ర ఉందని ఆధారాలతో సహా నిరూపించాలని సూచించారు. వైసీపీ నేతలు చేసే ప్రేరేపిత వ్యాఖ్యలకు, బెదిరింపులకు లొంగవద్దని హెచ్చరించారు.

 

"వైసీపీ నేతలు వేసే ఉచ్చులో పడొద్దు. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. మహిళల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి" అని పవన్ హితవు పలికారు. విమర్శలకు సిద్ధాంతపరంగా, విషయ పరిజ్ఞానంతోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, అధికార కూటమిపై సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయకుండా, కూటమి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

 

ఈ ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం గ్రామ స్థాయిలో ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమలలో శ్రీవారి డాలర్ల అమ్మకాలు బంద్.
నష్టాలు నివారించేందుకు అమ్మకాల్లో మార్పులకు శ్రీకారం రోజువారీ ధరలు, దర్శన టికెట్ ఉన్నవారికే...
By Pagadala Venkateswar 2026-01-31 06:00:29 0 149
SURAKSHA
Sarfaraz Ahmad, IAS: Driving Telangana's Urban Future
A Visionary Administrator Transforming Urban Governance with Innovation, Transparency, and...
By Lokeshwari Panthadi 2026-07-15 12:42:22 0 91
Andhra Pradesh
పుంగనూరు: శని త్రయోదశి కి అన్ని ఏర్పాటు పూర్తి: మంజునాథ్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మొరవలో వెలసి ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ఈనెల...
By Kothuru Murali 2026-05-15 15:36:39 0 84
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని కేజీబీవీ
కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్ చలగాటం! మండలకేంద్రంయిన నందవరం కేజీబీవీ హాస్టల్ లో...
By Boya Dasthagiri 2026-04-22 09:44:48 0 150
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Forest and Environment Protection
Madhya Pradesh continues to reinforce environmental conservation through forest protection,...
By Fathima Safa 2026-07-02 09:29:31 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com