డ్రగ్స్ పై దండయాత్ర

0
194

*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*

 

*పత్రికా ప్రకటన* *తేదీ. 01.02.2026*

 

 *🔴పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారి నేతృత్వంలో ఎన్.టి.ఆర్.జిల్లా పరిధిలో 35 రోజులపాటు డ్రగ్స్ రహిత సమాజం కోసం ముందడుగు వేస్తూ డ్రగ్స్ పై దండయాత్ర అనే నినాదంతో 510 కిలోమీటర్ల 🚴 సైకిల్ యాత్రలో బాగంగా ఈ రోజు డి.సి.పి. శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్.గారి పర్యవేక్షణలో సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత ఘనంగా కొనసాగుతున్న డ్రగ్స్ పై దండయాత్ర ఏడవ రోజు🚴 సైకిల్ యాత్ర కార్యక్రమం.*

 

*🔴ఈ రోజు సౌత్ ఏ.సి.పి. శ్రీ పావన్ కుమార్ గారు, ఎస్.ఆర్.పేట ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.డి.ఆలీ గార్ల ఆద్వర్యంలో సూర్యారావు పేట పోలీసు స్టేషన్ పరిదిలోని మదర్ తెరిస్సా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాల నందు సమావేశం ఏర్పాటు చేసి నర్సింగ్ విధ్యార్ధినులు మరియు ఎస్.టి.ఆర్.ఎం.సి. హై స్కూల్ విధ్యార్ధులకు అవగాహన కల్పించడం జరిగింది.*

 

*🔴 అనంతరం ఈ ఉధ్యమ సైకిల్ ర్యాలీ బి.ఆర్.టి.ఎస్. రోడ్డు నుండి మొదలై గులాబీ తోట, కొత్త వంతెన, దుర్గా అగ్రహారం, సాంబమూర్తి రోడ్డు, నక్కల రోడ్డు మీదుగా శ్రీధర్ కోచింగ్ సెంటర్ నందు భారీ సమావేశం ఏర్పాటు చేసి 1200 మంది విధ్యార్ధినీ విధ్యార్ధులతో డ్రగ్స్ వినియోగించడం వలన కలిగే నష్టాల గురించి మరియు ఎన్.డి.పి.ఎస్. చట్టాల గురించి వివరించడం జరిగింది.* 

 

*🔴ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు, ఈస్ట్ డి.సి.పి. శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్.గారు, అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కే.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు, ఏ.డి.సి.పి. శ్రీ ఎం.బి.ఎం.మురళి కృష్ణ గారు, సౌత్ ఏ.సి.పి. శ్రీ పావన్ కుమార్ గారు, ఎస్.ఆర్.పేట ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.డి.ఆలీ గారు, టాస్క్ ఫోర్స్, ఈగల్ బృందం, శ్రీధర్ కోచింగ్ సెంటర్ అధికారులు మరియు 1200 మంది విద్యార్థినీ విధ్యార్ధులు పాల్గొన్నారు.*

Search
Categories
Read More
Telangana
"మల్కాజ్‌గిరి అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు మంత్రి కొండా సురేఖను కలిసిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు...
By Sidhu Maroju 2026-06-09 09:29:42 0 112
Bihar
Bihar Advances Education and Skill Development Drive
Bihar is strengthening its education and skill development ecosystem through expanded learning...
By Fathima Safa 2026-07-01 08:45:31 0 71
Andhra Pradesh
Payyavula Keshav: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ గుట్టురట్టు... ఇవిగో ఆధారాలు: పయ్యావుల కేశవ్.
టీటీడీ నెయ్యి కల్తీకి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న పయ్యావుల 2022లోనే కల్తీపై...
By Pagadala Venkateswar 2026-01-31 12:13:00 0 180
Telangana
హమాలీల కొరత మిల్లర్ల వద్ద ట్రాక్టర్లు బార్లు తీయడం జరిగింది....!
భారత్  అవాజ్ న్యూస్:16 మే రోజున 10:40 ని"వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా హమాలీల...
By Gujile Ramu 2026-05-16 07:04:47 0 133
SURAKSHA
K. Sethuraman IPS: Leading Kerala Police with Integrity
The Journey Begins "True leadership in policing is measured not by authority,...
By Fathima Safa 2026-07-09 07:26:01 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com