డ్రగ్స్ పై దండయాత్ర

0
65

*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*

 

*పత్రికా ప్రకటన* *తేదీ. 01.02.2026*

 

 *🔴పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారి నేతృత్వంలో ఎన్.టి.ఆర్.జిల్లా పరిధిలో 35 రోజులపాటు డ్రగ్స్ రహిత సమాజం కోసం ముందడుగు వేస్తూ డ్రగ్స్ పై దండయాత్ర అనే నినాదంతో 510 కిలోమీటర్ల 🚴 సైకిల్ యాత్రలో బాగంగా ఈ రోజు డి.సి.పి. శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్.గారి పర్యవేక్షణలో సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత ఘనంగా కొనసాగుతున్న డ్రగ్స్ పై దండయాత్ర ఏడవ రోజు🚴 సైకిల్ యాత్ర కార్యక్రమం.*

 

*🔴ఈ రోజు సౌత్ ఏ.సి.పి. శ్రీ పావన్ కుమార్ గారు, ఎస్.ఆర్.పేట ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.డి.ఆలీ గార్ల ఆద్వర్యంలో సూర్యారావు పేట పోలీసు స్టేషన్ పరిదిలోని మదర్ తెరిస్సా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాల నందు సమావేశం ఏర్పాటు చేసి నర్సింగ్ విధ్యార్ధినులు మరియు ఎస్.టి.ఆర్.ఎం.సి. హై స్కూల్ విధ్యార్ధులకు అవగాహన కల్పించడం జరిగింది.*

 

*🔴 అనంతరం ఈ ఉధ్యమ సైకిల్ ర్యాలీ బి.ఆర్.టి.ఎస్. రోడ్డు నుండి మొదలై గులాబీ తోట, కొత్త వంతెన, దుర్గా అగ్రహారం, సాంబమూర్తి రోడ్డు, నక్కల రోడ్డు మీదుగా శ్రీధర్ కోచింగ్ సెంటర్ నందు భారీ సమావేశం ఏర్పాటు చేసి 1200 మంది విధ్యార్ధినీ విధ్యార్ధులతో డ్రగ్స్ వినియోగించడం వలన కలిగే నష్టాల గురించి మరియు ఎన్.డి.పి.ఎస్. చట్టాల గురించి వివరించడం జరిగింది.* 

 

*🔴ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు, ఈస్ట్ డి.సి.పి. శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్.గారు, అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కే.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు, ఏ.డి.సి.పి. శ్రీ ఎం.బి.ఎం.మురళి కృష్ణ గారు, సౌత్ ఏ.సి.పి. శ్రీ పావన్ కుమార్ గారు, ఎస్.ఆర్.పేట ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.డి.ఆలీ గారు, టాస్క్ ఫోర్స్, ఈగల్ బృందం, శ్రీధర్ కోచింగ్ సెంటర్ అధికారులు మరియు 1200 మంది విద్యార్థినీ విధ్యార్ధులు పాల్గొన్నారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని...
By Kothuru Murali 2026-01-30 04:35:00 0 41
BMA
Importance and Need of Media Associations
In India's vibrant democracy, media associations are not just beneficial, but essential –...
By Bharat Aawaz 2025-05-28 18:29:58 0 2K
Bharat Aawaz
Article 12 – Who Is "The State" in the Eyes of the Constitution?
Why It Matters: Whenever we say “Fundamental Rights protect us from the State”, it...
By Bharat Aawaz 2025-06-26 11:31:48 0 2K
Andhra Pradesh
ఒంగోలులో కొత్తగా ప్రారంభమైన Samsung Experience Store (Vasisht retail) 13 వ బ్రాంచ్
ఒంగోలు నగరవాసులకు శుభవార్త! అత్యాధునిక టెక్నాలజీని మరింత దగ్గర చేస్తూ, Samsung...
By SivaNagendra Annapareddy 2025-12-12 10:44:32 0 292
Andhra Pradesh
ఎంపీ కేశినేని శివనాద్ కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం.
*ప్ర‌చుర‌ణార్థం* *11-01-2026*   తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న...
By Rajini Kumari 2026-01-11 09:35:20 0 69
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com