డ్రగ్స్ పై దండయాత్ర

0
64

*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*

 

*పత్రికా ప్రకటన* *తేదీ. 01.02.2026*

 

 *🔴పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారి నేతృత్వంలో ఎన్.టి.ఆర్.జిల్లా పరిధిలో 35 రోజులపాటు డ్రగ్స్ రహిత సమాజం కోసం ముందడుగు వేస్తూ డ్రగ్స్ పై దండయాత్ర అనే నినాదంతో 510 కిలోమీటర్ల 🚴 సైకిల్ యాత్రలో బాగంగా ఈ రోజు డి.సి.పి. శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్.గారి పర్యవేక్షణలో సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత ఘనంగా కొనసాగుతున్న డ్రగ్స్ పై దండయాత్ర ఏడవ రోజు🚴 సైకిల్ యాత్ర కార్యక్రమం.*

 

*🔴ఈ రోజు సౌత్ ఏ.సి.పి. శ్రీ పావన్ కుమార్ గారు, ఎస్.ఆర్.పేట ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.డి.ఆలీ గార్ల ఆద్వర్యంలో సూర్యారావు పేట పోలీసు స్టేషన్ పరిదిలోని మదర్ తెరిస్సా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాల నందు సమావేశం ఏర్పాటు చేసి నర్సింగ్ విధ్యార్ధినులు మరియు ఎస్.టి.ఆర్.ఎం.సి. హై స్కూల్ విధ్యార్ధులకు అవగాహన కల్పించడం జరిగింది.*

 

*🔴 అనంతరం ఈ ఉధ్యమ సైకిల్ ర్యాలీ బి.ఆర్.టి.ఎస్. రోడ్డు నుండి మొదలై గులాబీ తోట, కొత్త వంతెన, దుర్గా అగ్రహారం, సాంబమూర్తి రోడ్డు, నక్కల రోడ్డు మీదుగా శ్రీధర్ కోచింగ్ సెంటర్ నందు భారీ సమావేశం ఏర్పాటు చేసి 1200 మంది విధ్యార్ధినీ విధ్యార్ధులతో డ్రగ్స్ వినియోగించడం వలన కలిగే నష్టాల గురించి మరియు ఎన్.డి.పి.ఎస్. చట్టాల గురించి వివరించడం జరిగింది.* 

 

*🔴ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు, ఈస్ట్ డి.సి.పి. శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్.గారు, అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కే.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు, ఏ.డి.సి.పి. శ్రీ ఎం.బి.ఎం.మురళి కృష్ణ గారు, సౌత్ ఏ.సి.పి. శ్రీ పావన్ కుమార్ గారు, ఎస్.ఆర్.పేట ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.డి.ఆలీ గారు, టాస్క్ ఫోర్స్, ఈగల్ బృందం, శ్రీధర్ కోచింగ్ సెంటర్ అధికారులు మరియు 1200 మంది విద్యార్థినీ విధ్యార్ధులు పాల్గొన్నారు.*

Search
Categories
Read More
Telangana
జీవోలు దాచిపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.|
హైదరాబాద్ : అన్ని ప్రభుత్వ జీవోలు, సర్క్యులర్లు, నియమాలు, నోటిఫికేషన్‌లను వెంటనే తమ అధికారిక...
By Sidhu Maroju 2025-12-23 12:47:06 0 113
Andhra Pradesh
లోక్ అదాలత్ లో 90 కి పైగా కేసుల పరిష్కారం
*లోక్‌ అదాలత్‌లో 90కి పైగా కేసుల పరిష్కారం*    *మంగళగిరి రూరల్ ఎస్సై...
By Rajini Kumari 2025-12-24 08:05:42 0 88
Bharat Aawaz
Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live
📰 Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live India's ground-level...
By Bharat Aawaz 2025-06-27 12:14:59 0 2K
Andhra Pradesh
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి : ప్రత్తిపాటి
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి గుంటూరు మిర్చి యార్డ్ నూతన ఛైర్మన్ కు మాజీమంత్రి...
By Gadiyapudi Narendra 2025-12-27 16:11:37 0 187
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com