కల్తీ పాల మృతుల కేసులో సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్షల పరిహారం

0
164

*Press Release*

 

*కల్తీపాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం*

 

*శాసనసభలో ప్రటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు* 

 

*నివేదిక రాగానే బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి*

 

*అమరావతి, ఫిబ్రవరి 23 :-* రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో కల్తీపాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటనపై శాసన సభలో మాట్లాడిన సీఎం...బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

 

*కల్తీపాల ఘటన చాలా బాధాకరం*

 

శాసన సభలో రాజమహేంద్రవరం ఘటనపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...‘రాజమహేంద్రవరం ఘటనలోని బాధితులు వాంతులు, కడుపునొప్పి, డయాలసిస్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్లీనికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయి పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో వరలక్ష్మీ మిల్క్ డెయిరీ 106 కుటుంబాలకు రోజూ పాల సరఫరా చేస్తోంది. ఈ డెయిరీ నుంచి వచ్చిన పాలను తాగి అనారోగ్యం పాలయ్యారని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో 8 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ముగ్గురు 70 ఏళ్లకు పైబడిన వారు, ఒకరు 58 ఏళ్ల వయసు వారు ఉన్నారు. బాధితుల నుంచి నమూనాలను తీసుకుని హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్స్‌కు పరీక్షల కోసం పంపించాం. డెయిరీ నిర్వాహకుడు అద్దాల గణేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కాసులకు కక్కుర్తి పడి ఈ కల్తీ వ్యవహారానికి పాల్పడితే సీరియస్‌గా తీసుకుంటాం. విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసకుంటాం. రాష్ట్రంలో ఎవరైనా కల్తీకి పాల్పడినా, ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు...అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 

 

*అసెంబ్లీలోని ఛాంబర్‌లో సమీక్ష*

 

రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్‌, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో పాల వినియోగంతో స్థానికులు అస్వస్థతకు గురవడం, పలువురు మరణించారన్న ఘటన తెలియగానే ఉదయమే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షించి ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యసాయంపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. పాలు వినియోగించిన కుటుంబాల్లోని 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని, మిగిలిన వారందరి నుంచి కూడా నమూనాలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై మరోసారి అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మంత్రులు, అధికారులతో మధ్యాహ్నం సీఎం చంద్రబాబు సమీక్షించారు.  

******

Search
Categories
Read More
Andhra Pradesh
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్...
By Pagadala Venkateswar 2026-02-25 08:15:19 0 160
Telangana
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్.
బోరాణి కమ్యూనిటీ లో మొహర్రం యొక్క ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, సబిత అనిల్...
By Sidhu Maroju 2025-07-02 13:43:06 0 1K
Andhra Pradesh
ప్రతి సమస్యకూ పరిష్కారమే లక్ష్యంగా _మహమ్మద్ నజీర్
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా స్థానిక మా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాం. ప్రతి సమస్యకూ...
By John Baji 2026-01-21 10:40:34 0 172
Telangana
మంచిర్యాల నియోజకవర్గం రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం మాదరిపేట్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-04-29 11:54:40 0 172
Andhra Pradesh
పంట నష్టం వివాదం – దంపతులపై కర్రలతో దాడి.
గురువారం, రామసముద్రం మండలంలోని నారిగానిపల్లి పంచాయతీ దిగువలంబంవారిపల్లెలో పంట నష్టం వివాదం తీవ్ర...
By Pagadala Venkateswar 2026-04-02 10:21:27 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com