Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు.

0
152

 

 

 

 

 

Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు

01-02-2026 Sun 22:28 | Andhra

Chandrababu Naidu Slams YSRCP Crime Politics Culture

వైసీపీ హయాంలో రాజకీయాలు నేరమయం అయ్యాయన్న చంద్రబాబు

తాము అధికారంలోకి వచ్చాక చట్టబద్ధ పాలన నెలకొల్పామని వెల్లడి

 

నిరాశ, నిస్పృహలతోనే వైసీపీ నేతలు తిట్లకు దిగుతున్నారని విమర్శ

శాంతిభద్రతలను ఉల్లంఘిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టీకరణ

వైసీనీ రాజకీయాలు నేరమయం అయ్యాయని, వారి పాలనకు అరాచకమే నమూనాగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. 2024లో తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను తిరిగి నెలకొల్పామని ఆయన స్పష్టం చేశారు. నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి అని... ప్రజా సాధికారత, ప్రజాసేవ తమ ప్రభుత్వ సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు.

 

గతంలో వారు ధ్వంసం చేసిన ప్రతీదాన్నీ తమ ప్రభుత్వం తిరిగి నిర్మిస్తుండటాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చంద్రబాబు అన్నారు. వారి తప్పులు రోజురోజుకు బయటపడుతుండటంతో, నిరాశ, నిస్పృహలకు లోనై ప్రతిపక్షంలో ఉన్నా కూడా దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు.

 

అయితే, చట్టం అత్యున్నతమైనదని, తాము నెలకొల్పిన శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తేల్చిచెప్పారు. చట్టాన్ని, నియమాలను ఉల్లంఘించడానికి ఎవరినీ అనుమతించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త.
పుంగనూరు మండలం, మంగళం గ్రామంలో బుధవారం అనుమానంతో భార్య మౌనిక గొంతును భర్త అశోక్ కత్తితో కోశాడు....
By Kothuru Murali 2026-01-28 09:36:18 0 169
Andhra Pradesh
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలోAP NGO రాష్ట్ర అధ్యక్షులు ఏకగ్రీవ ఎన్నిక
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *విజ‌య‌వాడ‌, డిసెంబ‌ర్ 22,...
By Rajini Kumari 2025-12-23 07:28:50 0 187
Telangana
గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నూతన అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లోని చౌదర్ పల్లి గ్రామంలో నూతనంగా అండర్ డ్రైనేజీ పనులను...
By MERIGE MALLESH 2026-05-29 10:49:32 0 2K
Telangana
వరంగల్‌లో హిందూశక్తి ప్రదర్శన… చికోటి ప్రవీణ్ పిలుపు”.|
హైదరాబాద్ : వరంగల్ లో శ్రీరామనవమి సందర్భంగా హిందూ సంకల్ప బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ...
By Sidhu Maroju 2026-03-29 09:09:57 0 236
Telangana
ఆరు విడుతల డీ.ఏ ల బకాయిలను చెల్లించాలి-డి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు నెల్లుట్ల భాస్కర్
మహబూబాబాద్, కొత్తగూడ, జనవరి 7(భారత్ అవాజ్): మండల విద్యా వనరుల కేంద్రం కొత్తగూడ కార్యాలయంలో MEO...
By Bheeshman King 2026-01-07 09:11:48 0 410
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com