Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు.

0
92

 

 

 

 

 

Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు

01-02-2026 Sun 22:28 | Andhra

Chandrababu Naidu Slams YSRCP Crime Politics Culture

వైసీపీ హయాంలో రాజకీయాలు నేరమయం అయ్యాయన్న చంద్రబాబు

తాము అధికారంలోకి వచ్చాక చట్టబద్ధ పాలన నెలకొల్పామని వెల్లడి

 

నిరాశ, నిస్పృహలతోనే వైసీపీ నేతలు తిట్లకు దిగుతున్నారని విమర్శ

శాంతిభద్రతలను ఉల్లంఘిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టీకరణ

వైసీనీ రాజకీయాలు నేరమయం అయ్యాయని, వారి పాలనకు అరాచకమే నమూనాగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. 2024లో తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను తిరిగి నెలకొల్పామని ఆయన స్పష్టం చేశారు. నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి అని... ప్రజా సాధికారత, ప్రజాసేవ తమ ప్రభుత్వ సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు.

 

గతంలో వారు ధ్వంసం చేసిన ప్రతీదాన్నీ తమ ప్రభుత్వం తిరిగి నిర్మిస్తుండటాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చంద్రబాబు అన్నారు. వారి తప్పులు రోజురోజుకు బయటపడుతుండటంతో, నిరాశ, నిస్పృహలకు లోనై ప్రతిపక్షంలో ఉన్నా కూడా దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు.

 

అయితే, చట్టం అత్యున్నతమైనదని, తాము నెలకొల్పిన శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తేల్చిచెప్పారు. చట్టాన్ని, నియమాలను ఉల్లంఘించడానికి ఎవరినీ అనుమతించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో ఇంటర్ ఇన్విజిలేటర్ తొలగింపు
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్...
By Kothuru Murali 2026-02-26 12:46:07 0 73
Andhra Pradesh
గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్. సి. సి అవార్డు.
మదనపల్లె మండలం సి. టి. ఎమ్. పాఠశాల ఎన్. సి. సి ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక...
By Pagadala Venkateswar 2026-03-01 04:26:53 0 83
Andhra Pradesh
శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర బృందం
మహాసేయులకు విజ్ఞప్తి' సినిమా బృందం సోమవారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంది....
By Kothuru Murali 2026-01-12 13:55:59 0 122
Andhra Pradesh
పన్నులు చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు:కమిషనర్
బొబ్బిలి మున్సిపాలిటీలో పన్నులు చెల్లించిన ప్రజలకు కమిషనర్ ఎల్.రామలక్ష్మి,సిబ్బంది కృతజ్ఞతలు...
By Boiena Rajesh 2026-04-01 00:23:56 0 74
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com