Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు.

0
153

 

 

 

 

 

Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు

01-02-2026 Sun 22:28 | Andhra

Chandrababu Naidu Slams YSRCP Crime Politics Culture

వైసీపీ హయాంలో రాజకీయాలు నేరమయం అయ్యాయన్న చంద్రబాబు

తాము అధికారంలోకి వచ్చాక చట్టబద్ధ పాలన నెలకొల్పామని వెల్లడి

 

నిరాశ, నిస్పృహలతోనే వైసీపీ నేతలు తిట్లకు దిగుతున్నారని విమర్శ

శాంతిభద్రతలను ఉల్లంఘిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టీకరణ

వైసీనీ రాజకీయాలు నేరమయం అయ్యాయని, వారి పాలనకు అరాచకమే నమూనాగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. 2024లో తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను తిరిగి నెలకొల్పామని ఆయన స్పష్టం చేశారు. నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి అని... ప్రజా సాధికారత, ప్రజాసేవ తమ ప్రభుత్వ సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు.

 

గతంలో వారు ధ్వంసం చేసిన ప్రతీదాన్నీ తమ ప్రభుత్వం తిరిగి నిర్మిస్తుండటాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చంద్రబాబు అన్నారు. వారి తప్పులు రోజురోజుకు బయటపడుతుండటంతో, నిరాశ, నిస్పృహలకు లోనై ప్రతిపక్షంలో ఉన్నా కూడా దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు.

 

అయితే, చట్టం అత్యున్నతమైనదని, తాము నెలకొల్పిన శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తేల్చిచెప్పారు. చట్టాన్ని, నియమాలను ఉల్లంఘించడానికి ఎవరినీ అనుమతించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన రష్యన్ ప్రతినిధి లియాగుట్ల జయరాములు
*అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన*  *రష్యన్ ప్రతినిధి* *లియాగుట్ల జయరాములు*  ...
By Rajini Kumari 2025-12-31 10:18:18 0 217
Andhra Pradesh
మాచర్ల రామ్మోహన్‌రావుపై దాడి హేయమైన చర్య: చేనేత నాయకులు.
చేనేతల సంక్షేమం కోసం కృషి చేస్తున్న చేనేత నాయకుడు మాచర్ల రామ్మోహన్‌రావుపై జరిగిన దాడిని...
By Pagadala Venkateswar 2026-06-11 05:28:33 0 69
Andhra Pradesh
హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు
వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.  ఈ...
By Vadlamudi NagaVenkat 2026-04-04 09:39:21 0 223
Andhra Pradesh
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 1 965. 65 కోట్లు నిధులు విడుదల
*ప్ర‌చుర‌ణార్థం* *19-12-2025*   *ఏపీకి ఎబి-పి.ఎమ్.జె.ఎ.వై ప‌థ‌కం...
By Rajini Kumari 2025-12-19 11:14:36 0 236
SURAKSHA
Pink Hoysala: Dedicated Patrol Vehicles Ensuring Women's Safety
The Pink Hoysala is a specialized initiative by the police department focused entirely on...
By Kalaga Sailaja 2026-06-26 11:04:59 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com