Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు.

0
109

Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు

02-02-2026 Mon 06:44 | Andhra

High Court Remarks on Ambati Rambabus Wife Petition

రాజకీయాల్లో ఉన్నవారు వాడే భాష సభ్య సమాజం మెచ్చేలా ఉండాలన్న కోర్టు

శాంతిభద్రతలే కాదు, సామాజిక సామరస్యం కాపాడటం కూడా పోలీసుల విధి అని వ్యాఖ్య

 

అంబటి రాంబాబు భార్య వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ

భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్పడంతో కేసు ముగింపు

రాజకీయ నాయకులు వాడే భాషపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఇతరులను కించపరిచేలా లేదా వివాదాలకు దారితీసేలా ఉండకూడదని స్పష్టం చేసింది. రాజకీయ నేతలు వాడే పదజాలం హుందాగా ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

 

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ఇంటి వద్ద రక్షణ అవసరమని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాజకీయాల్లో పెరుగుతున్న భాషా కాలుష్యంపై కోర్టు స్పందించింది.

 

కేవలం నేరాలను అదుపు చేయడం, శాంతిభద్రతలను పర్యవేక్షించడమే పోలీసుల పని కాదని కోర్టు గుర్తుచేసింది. సమాజంలో వివిధ వర్గాల మధ్య శాంతిని, సామరస్యాన్ని పెంపొందించాల్సిన గురుతర బాధ్యత కూడా పోలీసు వ్యవస్థపై ఉందని వ్యాఖ్యానించింది.

 

అంబటి రాంబాబు కుటుంబానికి ఇప్పటికే తగిన భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం, సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్‌ను పరిష్కరించినట్టు తెలిపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రీన్యూ సోలార్ ప్లాంట్... ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ భారీ సోలార్ ప్లాంట్ రూ. 5,400 కోట్ల పెట్టుబడితో ఇంగోట్-వేఫర్...
By Pagadala Venkateswar 2026-04-22 03:11:35 0 64
Andhra Pradesh
పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం
చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న...
By Kothuru Murali 2026-04-18 09:31:03 0 65
Andhra Pradesh
రహదారుల రూపకల్పనకు నిర్మాణాత్మకమైన కృషి. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
బాపట్ల: బాపట్ల నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలకు మహర్దశ కలిగింది. శాసనసభ్యులు వేగేశన నరేంద్ర...
By Gadiyapudi Narendra 2026-02-04 16:58:00 0 257
Telangana
గోదావరిఖని : మహాత్మ జ్యోతిరావు పూలే 1999 జయంతి వేడుకలు..!
ఈరోజు స్థానిక రాజేష్ టాకీస్ సమీపంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ వేడుకలు ఘనంగా...
By Sunka Santhosh 2026-04-11 06:11:45 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com