కేసిఆర్ విచారణకు సర్వం సిద్ధం- నంది నగర్ చేరుకున్న గులాబీ బాస్ .|

0
183

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కోవడానికి బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సిద్ధమయ్యారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న విచారణ కోసం ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ నుండి బయలుదేరి బంజారాహిల్స్ లోని నంది నగర్ నివాసానికి చేరుకున్నారు.

 

కేసీఆర్ ఎర్రవల్లి నుండి బయలుదేరి హైదరాబాద్ చేరుకునే వరకు దారి పొడుగునా బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేసిఆర్ కు సంఘీభావం తెలుపుతూ జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు కాన్వాయి వెంట ర్యాలీగా వచ్చారు. కెసిఆర్ పట్ల జరుగుతున్న విచారణను రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పార్టీ పిలుపునిచ్చింది.

 

విచారణ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నంది నగర్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14. పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.  

 

నంది నగర్ నివాసంలోనికి కేవలం కుటుంబ సభ్యులు, న్యాయానిపుణులను మాత్రమే అనుమతిస్తున్నారు.   

 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారం సేకరించినందుకు సిట్ అధికారులు కేసిఆర్ ను ప్రశ్నించనున్నారు. అంతకుముందు సిట్ అధికారులు ఎర్రవల్లికి రావాలని కేసీఆర్ కోరగా, సాంకేతిక కారణాల దృష్ట్యా సిట్ దానిని తిరస్కరించి అధికారుల రికార్డుల్లో ఉన్న నంది నగర్ లో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.  

బాధ్యతాయుతమైన పౌరుడిగా తాను విచారణకు సహకరిస్తానని కెసిఆర్ ఇప్పటికే లేఖ ద్వారా తెలిపారు. 

 

ప్రస్తుతం కెసిఆర్ తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, మరియు న్యాయ బృందంతో విచారణకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. 

 

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra: ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్.. ఎన్ని రోజులంటే.?
ఏపీ విద్యార్ధులకు పండుగ ముందే వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది....
By Siva Bhaskar 2025-12-26 04:18:40 0 570
Bharat
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for Sunday
Civil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for...
By BMA ADMIN 2025-05-24 08:10:18 0 3K
Business & Finance
What Is ZED? Boost Quality and Business Excellence
ZED (Zero Defect Zero Effect) is a certification scheme introduced by the Government of India to...
By Navya Sree 2026-07-20 06:47:08 0 34
Andhra Pradesh
భీమవరంలో బంగారు నగల కోడిపుంజు
*భీమవరంలో బంగారు పులిగోరు నగల కోడిపుంజు*   భీమవరం దుర్గాపురం లో జరిగిన కోడిపందాల లో ఓ...
By Rajini Kumari 2026-01-18 14:22:29 0 198
Andhra Pradesh
కరపలో పెరుగుతున్న ప్రమాదాలు, దొంగతనాలు – ప్రజల్లో ఆందోళన
కాకినాడ జిల్లా: కరప మండలంలో వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలు మరియు రోడ్డు ప్రమాదాలతో ప్రజలు...
By Ratna Sekhar 2026-02-13 13:32:25 0 267
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com