కేసిఆర్ విచారణకు సర్వం సిద్ధం- నంది నగర్ చేరుకున్న గులాబీ బాస్ .|

0
108

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కోవడానికి బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సిద్ధమయ్యారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న విచారణ కోసం ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ నుండి బయలుదేరి బంజారాహిల్స్ లోని నంది నగర్ నివాసానికి చేరుకున్నారు.

 

కేసీఆర్ ఎర్రవల్లి నుండి బయలుదేరి హైదరాబాద్ చేరుకునే వరకు దారి పొడుగునా బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేసిఆర్ కు సంఘీభావం తెలుపుతూ జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు కాన్వాయి వెంట ర్యాలీగా వచ్చారు. కెసిఆర్ పట్ల జరుగుతున్న విచారణను రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పార్టీ పిలుపునిచ్చింది.

 

విచారణ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నంది నగర్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14. పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.  

 

నంది నగర్ నివాసంలోనికి కేవలం కుటుంబ సభ్యులు, న్యాయానిపుణులను మాత్రమే అనుమతిస్తున్నారు.   

 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారం సేకరించినందుకు సిట్ అధికారులు కేసిఆర్ ను ప్రశ్నించనున్నారు. అంతకుముందు సిట్ అధికారులు ఎర్రవల్లికి రావాలని కేసీఆర్ కోరగా, సాంకేతిక కారణాల దృష్ట్యా సిట్ దానిని తిరస్కరించి అధికారుల రికార్డుల్లో ఉన్న నంది నగర్ లో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.  

బాధ్యతాయుతమైన పౌరుడిగా తాను విచారణకు సహకరిస్తానని కెసిఆర్ ఇప్పటికే లేఖ ద్వారా తెలిపారు. 

 

ప్రస్తుతం కెసిఆర్ తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, మరియు న్యాయ బృందంతో విచారణకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. 

 

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:43:42 0 184
Andhra Pradesh
పుంగనూరు: గుండెపోటుతో విలేఖరి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం...
By Kothuru Murali 2026-03-02 04:44:03 0 81
Andhra Pradesh
గో టుకూరు రెవెన్యూ పరిధిలోని భూ సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల
*గోటుకూరు రెవెన్యూ గ్రామం నందు రి సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల*   ఉరవకొండ...
By BOYA MADHU 2026-01-23 11:47:56 0 243
Ladakh
Ladakh High Court Refuses Bail in Narco‑Terrorism Juvenile Case
On July 16, 2025, the Jammu & Kashmir & Ladakh High Court denied bail to a juvenile...
By Bharat Aawaz 2025-07-17 06:29:24 0 988
Telangana
ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణే ధ్యేయంగా తిరుమలగిరిలో హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ఒక...
By Sidhu Maroju 2026-03-06 11:15:19 0 94
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com