TG Bharat: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పలేదు: టీజీ భరత్.

0
186

తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలు చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని చెప్పారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసి... ఇప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కర్నూలులో పింఛన్లను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

తిరుమలను కాపాడేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని భరత్ చెప్పారు. తప్పు చేసి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా శ్రీవేంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి క్షమాపణలు కోరాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై చర్చిస్తామని తెలిపారు. ఒకరోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేశామని చెప్పారు. దావోస్ పర్యటనలో ఏపీని అద్భుతంగా ప్రమోట్ చేశామని తెలిపారు. దీని అద్భుత ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By Rajini Kumari 2026-02-10 10:33:07 0 166
Andhra Pradesh
ఉపవాస దీక్షలు రంజాన్ అనంతరం సముద్రతీరాలకు ముస్లింల రాక
చీరాల: చీరాలలో రంజాన్ పండగ ముగిసిన మరుసటి రోజు ముస్లింలు 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం...
By Gadiyapudi Narendra 2026-03-22 17:28:10 0 97
Andhra Pradesh
విజయవాడ భవానిపురం లో ఉచిత గ్యాస్ కనెక్షన్ల దరఖాస్తు స్వీకరణ
ప్రెస్ నోట్    42 వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని క్లస్టర్ ఇంచార్జీ తెలుగుదేశం...
By Rajini Kumari 2026-02-21 17:08:21 0 88
Telangana
సైబరాబాద్ 24 ఏళ్ల ప్రస్థానం : సూరారం పీఎస్ లో సంబరాలు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సూరారం...
By Sidhu Maroju 2026-02-12 16:14:02 0 137
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com