TG Bharat: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పలేదు: టీజీ భరత్.

0
387

తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలు చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని చెప్పారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసి... ఇప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కర్నూలులో పింఛన్లను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

తిరుమలను కాపాడేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని భరత్ చెప్పారు. తప్పు చేసి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా శ్రీవేంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి క్షమాపణలు కోరాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై చర్చిస్తామని తెలిపారు. ఒకరోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేశామని చెప్పారు. దావోస్ పర్యటనలో ఏపీని అద్భుతంగా ప్రమోట్ చేశామని తెలిపారు. దీని అద్భుత ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి తో చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ:*   *ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-02-10 10:24:43 0 171
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:పిచర్ల మండలంలో మామిడికాయల వ్యాను బోల్తా
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో సోమవారం మామిడికాయల లోడ్ తో వస్తున్న వ్యాన్ టైర్ పంచర్...
By Kothuru Murali 2026-06-16 13:47:41 0 83
Telangana
నిజామాబాద్ : ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:15:19 0 253
Telangana
నిజామాబాద్: శ్రీ నీలకేశ్వరాలయంలో ఉగాది పంచాంగ శ్రావణం
జిల్లా లోని నీలకంఠేశ్వరాలయం ఉగాది పండగ శోభాతో కలకలడిo కలకాలాడిoధి.గురువారం ఆలయంలో శాస్రోక్తంగా...
By Sadaq Sadaq 2026-03-19 17:27:27 0 184
Andhra Pradesh
మదనపల్లి: ప్రకృతి వ్యవసాయ కరదీపికల ఆవిష్కరణ.
ఎల్ నిన్యో వాతావరణ మార్పుల నేపథ్యంలో మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-06-10 05:22:56 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com