APPSC Group 1: ఏపీపీఎస్‌సీ గ్రూప్ - 1 ఫలితాలు విడుదల.

0
121

హైకోర్టు ఆదేశాలతో క్రీడా కోటాకు సంబంధించి రెండు పోస్టులు రిజర్వు చేసిన ఏపీపీఎస్‌సీ

హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి అడ్డంకులు తొలగడంతో నిన్న సాయంత్రం ఏపీపీఎస్‌సీ గ్రూప్‌ -1 అభ్యర్థుల ఎంపిక జాబితాను ఎట్టకేలకు విడుదల చేసింది. మొత్తం 89 పోస్టులకు గాను 87 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేసింది. క్రీడా కోటాకు సంబంధించిన రెండు పోస్టులను రిజర్వు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో వాటిని పక్కన పెట్టింది. క్రీడా కోటా పరిధిలోకి వచ్చే సహాయ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌, డీఎస్పీ పోస్టులపై కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. 

 

గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి సంబంధించి 2023 డిసెంబరు 8న నోటిఫికేషన్‌ విడుదలైంది. 2024 మార్చి 17న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా, 2025 మే నెలలో మెయిన్స్‌ పరీక్షలు పూర్తయ్యాయి. జూన్‌లో మెయిన్స్‌ ఫలితాలు ప్రకటించారు. అనంతరం గతేడాది జూన్‌ 23 నుంచి జులై 15 వరకు జనరల్‌ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. క్రీడా కోటాకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఈ ఏడాది జనవరి 7న పూర్తి చేశారు. 

 

ఈ ఎంపిక జాబితాలో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 9, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌ 17, డీఎస్పీ పోస్టులు 25 ఉన్నాయి. అలాగే డీఎస్పీ (జైళ్లు) ఒకటి, డివిజనల్‌/జిల్లా ఫైర్‌ సర్వీస్‌ అధికారి రెండు, ఆర్టీవోలు ఆరు పోస్టులు ఉన్నాయి. జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఒకటి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి మూడు, డిప్యూటీ రిజిస్ట్రార్స్‌ ఆరు, పురపాలక కమిషనర్‌ (సెకండ్‌ గ్రేడ్‌) మూడు పోస్టులు ఎంపికయ్యాయి. సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఒకటి, సహాయ ట్రెజరీ అధికారి/సహాయ అకౌంటింగ్‌ అధికారి మూడు, జిల్లా ఉపాధి కల్పన అధికారి నాలుగు, సహాయ ఆడిట్‌ అధికారి రెండు, మండలాభివృద్ధి అధికారి నాలుగు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇకపై వేగంగా గ్రీన్‌కార్డుల ప్రక్రియ*
* తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:33:51 0 201
Andhra Pradesh
ఆర్బీఐ లో ఉద్యోగాలు!!
కర్నూలు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో గ్రేడ్-బి పోస్టుల...
By Hari Krishna 2025-12-23 04:25:49 0 165
Telangana
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని డిసీసీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి. వర్ధంతి కార్యక్రమం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పండ్ల పంపిణీ.
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి.జగదీష్  అసిఫాబాద్:భారతరత్న మాజీ...
By Chunarkar Jagadeesh 2026-05-21 09:33:05 0 190
Andhra Pradesh
టిఆర్ఎస్ పరిధిలో భోజనశాలను ప్రారంభించిన గద్దె రామ్మోహన్
విద్యావ్యవస్థను అగ్రగామిగా చేస్తున్న నారా లోకేష్‌ –9వ డివిజన్‌లో రూ.10 లక్షల...
By Rajini Kumari 2026-02-07 11:49:13 0 119
Andhra Pradesh
భూ వివాదం: కలెక్టర్ ఆదేశాలున్నా న్యాయం చేయని అధికారులు.
అన్నమయ్య జిల్లా కలికిరిలో భూ వివాదంలో బాధితులు మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మంగళవారం తమ ఆవేదన...
By Pagadala Venkateswar 2026-05-20 03:38:25 0 35
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com