Anagani Satya Prasad: ఏపీలో 22 ఏ భూముల సమస్య పరిష్కారానికి త్వరలో విధాన ప్రకటన: మంత్రి అనగాని.

0
138

రెవెన్యూ క్లినిక్‌లతో మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడి

రీసర్వేలో రైతులను భాగస్వామ్యం చేయాలన్న మంత్రి అనగాని

22ఏ భూ సమస్యలపై రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా త్వరలో విధాన ప్రకటన చేయనున్నట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూసమస్యలకు పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. 

 

సీసీఎల్‌ఏ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. మంత్రివర్గ ఉప సంఘంలో 22ఏ భూములపై చర్చ జరిగిందని, ఉన్నతాధికారులు విధానం రూపొందించిన తర్వాత ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌లతో మంచి ఫలితాలు వస్తున్నాయని, వాటిని మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు. 

 

ఫిబ్రవరి 2 నుంచి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టాలని, వాటిలో ఎలాంటి తప్పులు ఉండకూడదని స్పష్టం చేశారు. రీసర్వేలో గత తప్పులు పునరావృతం కాకుండా రైతులను భాగస్వాములుగా చేయాలని మంత్రి ఆదేశించారు. రీసర్వే గడువును 140 రోజులకు పెంచుతూ కొత్త ఎస్‌ఓపీ విడుదల చేసినట్లు తెలిపారు. రైతులు అందుబాటులో లేకుంటే సర్వే వాయిదా వేసి, వారి సమక్షంలోనే నిర్వహించాలని సూచించారు. 

Search
Categories
Read More
Assam
Assam's Solar Leap: 17% Families Pay Zero Power Bills
Assam Chief Minister Himanta Biswa Sarma announced a major milestone in the state's green...
By Lokeshwari Panthadi 2026-06-26 13:02:22 0 52
Andhra Pradesh
తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనానికి 30 గంటలు.
తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనాని Both States Tirumala Queue Lines...
By Pagadala Venkateswar 2026-05-25 04:51:10 0 107
Tamilnadu
Tamil Nadu Preserves Temples and Restores Heritage Sites
Tamil Nadu continues to prioritize temple administration and heritage restoration through...
By Fathima Safa 2026-06-29 10:41:44 0 46
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా300 మందికి అన్నదానం షేక్ షేక్షావలి సేవ స్పూర్తి ప్రశంసనీయం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం   దోర్నాల మండలంలో గత నాలుగు...
By Chennaiah Kati 2026-02-27 13:52:34 0 204
Telangana
రాష్ట్ర వేడుకగా వాసవి జయంతి, ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు...
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని...
By Nookapangu Manikanta 2026-04-25 11:47:01 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com