ACB Raids: ఆఫీస్‌ సబార్డినేట్ ఇంట్లో రూ.50 కోట్ల ఆస్తులు.. విస్తుపోయిన ఏసీబీ అధికారులు.

0
172

Andhra

ACB officials stunned by Rs 50 Crore Assets of Tirupati Office Subordinate Tirumalesh

రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు

అక్రమాస్తుల కేసులో అటెండర్ తిరుమలేశ్‌పై చర్యలు

 

రూ.50 కోట్లకు పైగా మార్కెట్ విలువైన ఆస్తులు గుర్తింపు

11 స్థిరాస్తులు, భారీగా బంగారం, వెండి స్వాధీనం

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో రూ.50 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గ్రేడ్‌-3 ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న నల్లిపోగు తిరుమలేశ్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ చూసి అధికారులే విస్మయానికి గురయ్యారు.

 

అక్రమాస్తుల కేసులో కొద్ది రోజుల క్రితమే సస్పెన్షన్‌కు గురైన తిరుమలేశ్‌పై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. గురువారం తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు నెల్లూరు జిల్లా డీసీ పల్లెలోని ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మొత్తం ఐదు చోట్ల ఈ తనిఖీలు జరిగాయి.

 

ఈ సోదాల్లో ఇప్పటివరకు 11 స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, 1.47 కిలోల‌ బంగారం, 8.77 కిలోల వెండి ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.15.26 లక్షల నగదు, ఇంట్లోని విలువైన ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలను కూడా సీజ్ చేశారు. ఓ సాధారణ స్థాయి ఉద్యోగికి ఈ స్థాయిలో ఆస్తులు ఎలా సమకూరాయన్న కోణంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
ఆశా వర్కర్లతో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చాయ్ పే చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో చాయ్ పే...
By Sidhu Maroju 2026-01-10 12:33:34 0 171
Uncategorized
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు.
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు...
By BMA ADMIN 2025-05-23 05:29:23 0 2K
Andhra Pradesh
మరో ఇద్దరు రౌడీ షీట్టర్ల జిల్లా బహిష్కరణ : కర్నూలు ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా...మరో ఇద్దరూ రౌడీ షీటర్ ల పై జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల...
By Hari Krishna 2025-12-28 10:59:27 0 215
Andhra Pradesh
AP Capital Amaravati : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. బిల్లును సిద్ధం చేసిన కేంద్రం?
Amaravati Capital : రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సిద్ధం చేస్తున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్...
By Siva Bhaskar 2026-01-22 04:53:16 0 430
Andhra Pradesh
గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్. సి. సి అవార్డు.
మదనపల్లె మండలం సి. టి. ఎమ్. పాఠశాల ఎన్. సి. సి ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక...
By Pagadala Venkateswar 2026-03-01 04:26:53 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com