Malla Ramgopal Naidu: కీర్తిచక్ర మేజర్‌కు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా.. రూ.1.25 కోట్ల నగదు బహుమతి.

0
138

కీర్తిచక్ర మేజర్ రామ్‌గోపాల్ నాయుడికి నగదు పురస్కారం

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన మేజర్ నాయుడు

కశ్మీర్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టి, సహచరులను కాపాడినందుకు ఈ పురస్కారం

2024 స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ఆయనకు కీర్తిచక్ర ప్రకటించిన కేంద్రం

కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడికి ఏపీ ప్రభుత్వం భారీ నగదు బహుమతి ప్రకటించింది. ఆయనకు రూ.1.25 కోట్లు అందిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. మేజర్ రామ్‌గోపాల్‌నాయుడు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామం.

 

2023 అక్టోబర్‌ 26న జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో మేజర్ రామ్‌గోపాల్ నాయుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడి, తన సహచర సైనికుల ప్రాణాలను కాపాడారు. ఆయన వీరత్వానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2024 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది.

 

కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో రామ్‌గోపాల్ నాయుడు బృందం గాలింపు చర్యలు చేపట్టింది. స్థానిక ఇళ్లలో దాక్కున్న ఐదుగురు ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరపగా, మేజర్ రామ్‌గోపాల్ ఏమాత్రం వెనకాడకుండా ఎదురుదాడికి దిగారు. అత్యంత సమీపం నుంచి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరో ఉగ్రవాది గ్రెనేడ్ విసరగా, చాకచక్యంగా తప్పించుకుని అతడిని కూడా హతమార్చారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

 

సాయుధ బలగాల్లో 'చక్ర' అవార్డులు పొందిన వారికి నగదు బహుమతులు అందించాలన్న ప్రభుత్వ విధానంలో భాగంగా ఏపీ సర్కార్ ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. శౌర్య పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు మేజర్‌గా ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు.# పి వెంకటేష్

Search
Categories
Read More
Telangana
ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి
ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా...
By Ponnala Srinivasrao 2026-04-24 00:49:44 0 109
Andhra Pradesh
చీరాల జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మర తనిఖీలు
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు...
By Vadlamudi NagaVenkat 2026-03-31 09:32:16 0 450
Andhra Pradesh
పెద్దమండ్యం రహదారిపై నీటి నిల్వ: దోమల భయం, ప్రజల ఆందోళన.
అన్నమయ్య జిల్లా మదనపల్లె, తంబళ్లపల్లెలోని పెద్దమండ్యం వద్ద ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉండే...
By Pagadala Venkateswar 2026-06-26 03:21:01 0 53
Andhra Pradesh
పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
పుంగనూరు పట్టణంలో సోమవారంతో ఏడు రోజులపాటు జరిగిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ఇన్ఛార్జ్...
By Kothuru Murali 2026-04-21 14:41:43 0 96
Andhra Pradesh
రేపు చంద్రబాబు కావలి పర్యటన షెడ్యూల్ ఇదిగో!
Andhra Chandrababu Naidu Kavali visit schedule నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో...
By Pagadala Venkateswar 2026-05-19 05:38:13 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com