Chandrababu Naidu: పాలనలో టెక్నాలజీ వినియోగం పెంచాలి: సీఎం చంద్రబాబు.

0
174

డేటా ఆధారిత పాలనే లక్ష్యం.. ఆర్టీజీఎస్‌పై సీఎం సమీక్ష

2026ను 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్'గా మార్చాలని పిలుపు

ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ వినియోగం పెంచాలని సీఎం ఆదేశం

'మన మిత్ర' ద్వారా ఇప్పటివరకు 1.43 కోట్ల మందికి సేవలు

పాలనలో సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించి, క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. డేటా ఆధారిత పాలనపై మరింత దృష్టి సారిస్తామని, 2026వ సంవత్సరాన్ని 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్'గా మార్చాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... సామర్థ్యం లేని ఉద్యోగులకు సరైన శిక్షణ ఇచ్చి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాలనలో ఎదురయ్యే అనేక సమస్యలను టెక్నాలజీతో సులభంగా పరిష్కరించవచ్చని అన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంచాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను (గ్రీవెన్సులు) ఏఐ ద్వారా వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

 

'మన మిత్ర' - వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 రకాల ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని, ఇప్పటివరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై కూడా సీఎం సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

Search
Categories
Read More
Telangana
నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో కేటీఆర్ పర్యటన చేయడం జరిగింది రైతులను వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది....
నర్సంపేట మార్కెట్లో కేటీఆర్ పర్యటన....   భారత్ అవాజ్ న్యూస్ : ఈరోజు నర్సంపేట వ్యవసాయ...
By Gujile Ramu 2026-05-05 16:11:29 0 279
Andhra Pradesh
పుంగనూరు: అకస్మాత్తుగా పగిలిన బస్సు విండ్ షీల్డ్
మదనపల్లె నుంచి పలమనేరుకు వెళ్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ముందు అద్దం మంగళవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-06-02 15:44:24 0 98
Uttar Pradesh
Nautapa, Storms Claim Over 15 Lives; Fresh Severe Heat Alert Issued for Purvanchal
Severe weather has devastated regions, with the intense Nautapa heatwave and subsequent strong...
By Tejaswini Komanduru 2026-06-05 07:46:58 0 619
Andhra Pradesh
నేతాజీ జయంతికి నాయకుల ఘన నివాళి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని నాయకులు, ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు...
By Pagadala Venkateswar 2026-01-23 07:03:30 0 165
Andhra Pradesh
శుభారాం డిగ్రీ కాలేజీలో ముందుగా ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు
పుంగనూరులోని శుభారామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేషులు...
By Kothuru Murali 2026-01-07 02:34:59 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com