స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

0
346

విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేయడంతో పాటు పాఠశాల సమయంలో రీల్స్ చేయడంతో పలుమార్లు ఉన్నతా ధికారులు హెచ్చరించారు. అయినా ఆ ఉపాధ్యాయురాలు తన తీరు మార్చుకోకపోవడంతో గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధించిన వివరాలివీ.. ఖమ్మం మామిళ్లగుడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బానోత్ గౌతమి కొన్ని నెలలుగా నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన ప్రమోషన్లు చేస్తూ.. తన ప్రభుత్వ పాఠశాల విధులను నిర్లక్ష్యం చేస్తోంది. అలాగే పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ సమయం వృథా చేస్తోందనే అంశాలపై గతంలో పలు మార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో గురువారం ఆమెను సస్పెండ్ చేశామని డీఈవో తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాడు అందించాలని, విధినిర్వ హణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే డీఈవో కార్యాలయంలో మరో ఇద్దరు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఒకరు సమయం పాటించకుండా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లడం, మరొకరు ఫైల్స్ ఆలస్యం చేస్తూ డీఈవో టేబుల్ పై ఉన్నాయంటూ అబద్ధాలు చెబుతుండ టంతో మెమో జారీ చేసినట్లు డీఈవో తెలిపారు. కార్యాలయ సిబ్బంది కార్యాలయ సమయపాలన పాటించాలని, అంకితభావంతో పని చేసి ఫైల్స్ అందించాలని డీఈవో సిబ్బందికి సూచించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారిని హెచ్చరించారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర గిరిక పోటీలు కడిమెట్ల గ్రామంలో
ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అంతర్ రాష్ట్ర గిరిక పోటీలు ఘనంగా...
By Boya Dasthagiri 2026-04-03 07:26:24 0 283
SURAKSHA
AP పోలీసులు వర్ష బాధితులకు తక్షణ సహాయం
 ఈరోజు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో AP పోలీసులు విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో వీధి వ్యాపారులకు...
By Kalaga Sailaja 2026-07-06 06:18:33 0 44
Andhra Pradesh
మంత్రి కొలుసు పార్థసారథి గారికి ఘనంగా స్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రాయచోటి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న...
By Benguluri Madhubabu 2026-05-03 08:22:48 0 243
Telangana
నర్సంపేట టు వరంగల్ రహదారిపై ఉదయం ఘోర ప్రమాదం....!
భారత అవాజ్ న్యూస్: 19 మే రోజున ఉదయంరోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన దుగ్గొండి మండలంలో...
By Gujile Ramu 2026-05-19 11:46:15 0 134
Tamilnadu
Tamil Nadu Advances Rural Development and Panchayats
Tamil Nadu continues to strengthen rural development through comprehensive Panchayat initiatives...
By Fathima Safa 2026-06-29 10:35:06 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com