స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

0
281

విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేయడంతో పాటు పాఠశాల సమయంలో రీల్స్ చేయడంతో పలుమార్లు ఉన్నతా ధికారులు హెచ్చరించారు. అయినా ఆ ఉపాధ్యాయురాలు తన తీరు మార్చుకోకపోవడంతో గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధించిన వివరాలివీ.. ఖమ్మం మామిళ్లగుడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బానోత్ గౌతమి కొన్ని నెలలుగా నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన ప్రమోషన్లు చేస్తూ.. తన ప్రభుత్వ పాఠశాల విధులను నిర్లక్ష్యం చేస్తోంది. అలాగే పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ సమయం వృథా చేస్తోందనే అంశాలపై గతంలో పలు మార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో గురువారం ఆమెను సస్పెండ్ చేశామని డీఈవో తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాడు అందించాలని, విధినిర్వ హణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే డీఈవో కార్యాలయంలో మరో ఇద్దరు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఒకరు సమయం పాటించకుండా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లడం, మరొకరు ఫైల్స్ ఆలస్యం చేస్తూ డీఈవో టేబుల్ పై ఉన్నాయంటూ అబద్ధాలు చెబుతుండ టంతో మెమో జారీ చేసినట్లు డీఈవో తెలిపారు. కార్యాలయ సిబ్బంది కార్యాలయ సమయపాలన పాటించాలని, అంకితభావంతో పని చేసి ఫైల్స్ అందించాలని డీఈవో సిబ్బందికి సూచించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారిని హెచ్చరించారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
గోదావరిలో మునిగిన విద్యార్థికి ఎమ్మెల్యే నివాళి.
భద్రాచలం వద్ద గోదావరి నదిలో మునిగి మృతి చెందిన విద్యార్థి సతీష్ మృతదేహం ఆదివారం వేకువజామున...
By Pagadala Venkateswar 2026-03-22 06:16:17 0 98
Andhra Pradesh
పుంగనూరు న్యాయవాదుల సంఘం బాధ్యతలు స్వీకరణ, న్యాయమూర్తుల నియామకంపై వినతి
అన్నమయ్య జిల్లా పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది విజయకుమార్, ప్రధాన...
By Kothuru Murali 2026-04-02 06:39:34 0 67
Andhra Pradesh
రొంపిచర్ల: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 2026-27లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు...
By Kothuru Murali 2026-02-21 08:29:11 0 84
Andhra Pradesh
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:: డిఐజీ కర్నూల్ ఇన్చార్జి ఎస్పి
కర్నూలు :కర్నూలు జిల్లా... సంక్రాంతి పండగ ఆఫర్లు అంటూ సైబర్ మోసాలు...ఫేక్ షాపింగ్ ల ఆఫర్లు,...
By Hari Krishna 2026-01-09 11:15:47 0 186
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది మౌర్యా రెడ్డి
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు...
By Benguluri Madhubabu 2026-02-22 06:40:38 0 154
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com