స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

0
315

విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేయడంతో పాటు పాఠశాల సమయంలో రీల్స్ చేయడంతో పలుమార్లు ఉన్నతా ధికారులు హెచ్చరించారు. అయినా ఆ ఉపాధ్యాయురాలు తన తీరు మార్చుకోకపోవడంతో గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధించిన వివరాలివీ.. ఖమ్మం మామిళ్లగుడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బానోత్ గౌతమి కొన్ని నెలలుగా నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన ప్రమోషన్లు చేస్తూ.. తన ప్రభుత్వ పాఠశాల విధులను నిర్లక్ష్యం చేస్తోంది. అలాగే పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ సమయం వృథా చేస్తోందనే అంశాలపై గతంలో పలు మార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో గురువారం ఆమెను సస్పెండ్ చేశామని డీఈవో తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాడు అందించాలని, విధినిర్వ హణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే డీఈవో కార్యాలయంలో మరో ఇద్దరు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఒకరు సమయం పాటించకుండా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లడం, మరొకరు ఫైల్స్ ఆలస్యం చేస్తూ డీఈవో టేబుల్ పై ఉన్నాయంటూ అబద్ధాలు చెబుతుండ టంతో మెమో జారీ చేసినట్లు డీఈవో తెలిపారు. కార్యాలయ సిబ్బంది కార్యాలయ సమయపాలన పాటించాలని, అంకితభావంతో పని చేసి ఫైల్స్ అందించాలని డీఈవో సిబ్బందికి సూచించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారిని హెచ్చరించారు.*

Search
Categories
Read More
Telangana
కాంగ్రెస్ మాజీ డీసీసీ అద్యక్షులు శ్రీ సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ మాజీ డీసీసీ అద్యక్షులు శ్రీ సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు గానంగా...
By Thalakayala Nagashiva 2026-04-07 18:17:18 0 342
Andhra Pradesh
తపాలా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పథకం కింద నగదు ప్రోత్సాహం
నందిగామ ఎన్టీఆర్ జిల్లా 2025 సంవత్సరమునకు గాను తపాలా శాఖ వారు నిర్వహించినటువంటి దీన్ దయాల్...
By Patan Khuddus 2026-04-17 15:39:01 0 310
Telangana
ఘనంగా ఈశ్వరీ బాయి 107 జయంతి - పాల్గొన్న ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బాలికల హక్కుల కోసం,100 ఏళ్ళ క్రితమే ఆంక్షలు,లింగ...
By Sidhu Maroju 2025-12-01 07:13:55 0 184
Andhra Pradesh
గుడిమెట్లలో ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
    భక్తిశ్రద్ధలతో పాతపాటి అంకమ్మ, నీలగిరి అంకమ్మ, గంగమ్మ, కాటమరాజు విగ్రహాల...
By Patan Khuddus 2026-05-08 11:45:54 0 175
Telangana
అయ్యప్పల పాదయాత్ర- ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ : అయ్యప్ప స్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-17 11:05:03 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com