పోలీసులతో జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించిన అడిషనల్ ఎస్పీ :

0
171

కర్నూలు సిటీ :
కర్నూలు జిల్లా....

జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందిచే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ ...

జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని కర్నూలు ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారి ఆదేశాల మేరకు ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి  జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎ ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ మోహన్ గారు  మాట్లాడుతూ...

ఓటరే ప్రజాస్వామ్య శక్తి అని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమేనన్నారు. 

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. 

ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 

ఓటు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మంచి సమాజ స్థాపనకు ఓటే కీలకమన్నారు.

ఈ క్రింది విధంగా ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారు  జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. 

 “భారతదేశ పౌరుడినైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయిత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను” 

ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు నారాయణ, జావేద్, ఆర్ ఎస్సైలు,  సివిల్, ఎఆర్, జిల్లా పోలీసు కార్యాలయ మినిస్టిరియల్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: వర్షపు నీటి వివాదంలో గొడవ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఎల్లారు బయలు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం...
By Kothuru Murali 2026-05-21 16:51:53 0 78
Andhra Pradesh
విద్యారంగంలో విప్లవాత్మమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్ ని కొనియాడిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్ రావు
విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్‌ –4వ డివిజన్‌లో...
By Rajini Kumari 2025-12-16 13:06:31 0 239
Andhra Pradesh
పుంగనూరు: పొన్నూరు పట్టణం రాంనగర్ లో పై వ్యక్తి అసభ్య ప్రవర్తన కేసు నమోదు: ఎస్సై
పుంగనూరు పట్టణంలోని రాంనగర్‌లో నివసిస్తున్న ఒక వివాహిత పట్ల 75 ఏళ్ల అంజప్ప అసభ్యంగా...
By Kothuru Murali 2026-02-08 10:17:00 0 147
Andhra Pradesh
లోన్ కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు- సుప్రీంకోర్టు వార్నింగ్
*సామాన్యులకు అర్థమయ్యేలా*: చాలా మంది బ్యాంకుల్లో {లేదా} ఫైనాన్స్ యాప్‌ లులో లోన్...
By John Baji 2026-02-05 02:38:10 0 450
Andhra Pradesh
బాల కార్మికుల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం: డీఈవో.
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదనపల్లెలో ఫోర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో...
By Pagadala Venkateswar 2026-06-13 10:47:29 0 59
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com