విద్యారంగంలో విప్లవాత్మమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్ ని కొనియాడిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్ రావు

0
196

విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్‌

–4వ డివిజన్‌లో అంగన్‌వాడీ స్కూల్‌ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

+++++

 

        విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని తూర్పు నియోజవకర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. 

 

   మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో రేగుల అనురాధ∙మున్సిపల్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో అంగన్‌వాడీ స్కూల్‌ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పరిశీలించారు. 

 

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ఏపీఐఐసీ కాలనీలో నూతనంగా అంగన్‌వాడీ స్కూల్‌ ఏర్పాటు చేయడానికి రూ.35 లక్షలను కేటాయించామన్నారు. ఈ అంగన్‌వాడీ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. చిన్నతనం నుంచే మంచి పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించడం ద్వారా వారు మంచి ఆరోగ్యవంతులుగా తయారు అవుతారనే మంచి ఉద్దేశ్యంతో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ చక్కటి మెనును సిద్ధం చేశారని చెప్పారు. పాఠశాలలోనే స్టోర్‌ రూమ్‌ను కూడా నిర్మాణం చేస్తున్నారన్నారు. ఈ పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నామన్నారు. పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి నిధులు సమకూర్చుకుని పాఠశాలను మరింతగా అభివృద్థి చేస్తామని చెప్పడం అభినందనీయమనాన్నారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకు వస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్‌ జాస్తి సాంబశివరావు, నాయకులు పాతూరి సాంబశివరావు, వడ్లపట్ల గోపాలకృష్ణ, రాజేష్, చలసాని రమణ, యేర్నేని వేదవ్యాస్, కోనేరు రాజేష్, కోడూరు ఆంజనేయవాసు, సురేంద్ర, బత్తుల దుర్గారావు, గద్దె రమేష్, కార్పోరేషన్‌ ఈఈ సామ్రాజ్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. పి.వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
సీఎం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
మంచిర్యాల కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ...
By Bonagiri RaviShankar 2026-05-22 00:51:35 0 44
Telangana
రాత్రిపూట ఇంటి తాళం పగలగొట్టి బంగారు వెండి నగల చోరీ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్  డిటెక్టివ్ ఇన్స్పెక్టర్  తిమ్మప్ప తెలిపిన...
By Sidhu Maroju 2025-09-23 16:01:54 0 361
Andhra Pradesh
*రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశాన్ని జయప్రదం చేయాలి.... రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
ఈనెల 19 వ తేదీన బాపట్ల పట్టణంలోని శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర...
By Vadlamudi NagaVenkat 2026-04-17 08:30:08 0 175
Andhra Pradesh
పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని...
By Kothuru Murali 2026-01-31 11:10:00 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com