అల్వాల్ పోలీసుల మెరుపు వేగం- అరగంటలోనే చిన్నారి ఆచూకీలభ్యం .|

0
169

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : క్షణాల్లో కళ్ళ ముందు నుండి కనబడకపోయినా తమ బాలుడు తిరిగి క్షేమంగా చేరడంతో తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు.

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఈఎస్ కాలనీలో నివాసముంటున్న  రమేష్ కుమారుడు ఏడేళ్ల సంజయ్ అదృశ్యమయ్యాడు. 

దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

పోలీసుల తక్షణ స్పందన : స్థానికుడి సహకారం.

ఫిర్యాదు అందిన వెంటనే అల్వాల్ పోలీసులు చురుగ్గా స్పందించారు. అదృశ్యమైన 30 నిమిషాల్లోనే బాలుని గుర్తించేందుకు తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో స్థానిక నివాసి మక్కల సర్వేష్ అందించిన కీలక సమాచారంతో  సంజయ్ ను పోలీస్ లు విజయవంతంగా గుర్తించారు.

బాలుడిని తల్లిదండ్రులకు  అప్పగించినప్పుడు,  ఇంతసేపు తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన వారు.. ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు. తమ బిడ్డను ఇంత తొందరగా క్షేమంగా అప్పగించిన పోలీసులకు, తల్లిదండ్రులు  కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు చూపిన చొరవను అల్వాల్ ఎస్ హెచ్ ఓ ప్రశాంత్ అభినందించారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Telangana
In loksabha seats to increase.
దేశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రీడ్...
By G k Nookala 2026-04-13 15:48:58 0 90
Kerala
Kerala Sees Surge in Women-Led MSMEs, Home-Based Businesses Rise |
Kerala has witnessed the launch of over 350,000 new micro, small, and medium enterprises in the...
By Pooja Patil 2025-09-16 06:13:35 0 160
Andhra Pradesh
నిమ్మల పల్లెలో ఘటన 12 మందిపై కేసు.
నిమ్మనపల్లె మండలం దిన్నిమీద జంగంపల్లిలో చింత చెట్ల నరికివేత విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై...
By Pagadala Venkateswar 2026-01-29 06:12:44 0 117
Andhra Pradesh
Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు...
By Pagadala Venkateswar 2026-01-18 10:36:58 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com