Tirumala: శ్రీవారికి భారీ విరాళాలు.. ఒకే రోజు కోట్లలో కానుకలు.

0
167

పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నుంచి రూ.2.50 కోట్ల విరాళం

మంత్రి లోకేశ్‌ పుట్టినరోజు సందర్భంగా రూ.44 లక్షలు విరాళం

టీటీడీలోని వివిధ ట్రస్టులకు ఈ విరాళాలను కేటాయింపు

తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళాలు అందాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, అలాగే ఓ విద్యాసంస్థల అధినేత వేర్వేరుగా స్వామివారికి కోట్లాది రూపాయలను కానుకగా సమర్పించారు. ఈ విరాళాలను టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వివిధ సేవా ట్రస్టులకు కేటాయించారు.

 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌కు చెందిన పీఎల్‌రాజు కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ, టీటీడీ ట్రస్టులకు మొత్తం రూ. 2.50 కోట్లు విరాళంగా ఇచ్చింది. సంస్థ ప్రతినిధి రాజగోపాలరాజు, శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఈ విరాళంలో శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు, విద్యాదాన ట్రస్టుకు చెరో రూ.75 లక్షలు ఉన్నాయి. అలాగే బర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలు, అన్నప్రసాదం, గో సంరక్షణ ట్రస్టులకు చెరో రూ.25 లక్షలు చొప్పున అందించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. పీఎల్‌రాజు కన్‌స్ట్రక్షన్స్ విరాళం అందించిన కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్‌ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.

 

మరోవైపు మంత్రి నారా లోకేశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. ఒకరోజు అన్నప్రసాద వితరణ కోసం ఆయన రూ. 44 లక్షలు అందించారు. నేడు మంత్రి లోకేశ్‌ పేరిట టీటీడీ అన్నప్రసాద కేంద్రంలో ప్రత్యేకంగా అన్నదానం నిర్వహించారు.

Search
Categories
Read More
Telangana
మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం...
By Pinnehasan Odela 2026-02-24 11:42:49 0 235
Telangana
#suryapet news
 సూర్యాపేట జిల్లాలోని ఒక చిన్నా గ్రామం లోని సర్పంచి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు తీసుకున్న...
By Mahankali Ravi 2026-04-16 14:59:38 0 481
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:41 0 41
Andhra Pradesh
కువైట్ లో మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు
కువైట్ లోని అబ్బాసియా ప్రాంతంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు టిడిపి...
By Benguluri Madhubabu 2026-05-16 11:45:53 0 207
Andhra Pradesh
Amaravati Cricket Stadium: అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనుల జోరు.. 90 శాతం పూర్తి.
కూటమి ప్రభుత్వం రాకతో అమరావతిలో పెరిగిన పనుల వేగం   నవులూరు వద్ద అంతర్జాతీయ క్రికెట్...
By Pagadala Venkateswar 2026-01-31 10:31:28 0 421
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com