Amaravati Cricket Stadium: అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనుల జోరు.. 90 శాతం పూర్తి.

0
424

కూటమి ప్రభుత్వం రాకతో అమరావతిలో పెరిగిన పనుల వేగం

 

నవులూరు వద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం

34 వేల సీటింగ్ కెపాసిటీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం

పనుల పురోగతిపై మున్సిపల్ శాఖ వీడియో విడుదల

రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. ఇందులో భాగంగా అమరావతి పరిధిలోని నవులూరు వద్ద నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు తుది దశకు చేరుకున్నాయి. స్టేడియం నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయిందని ఏపీ మున్సిపల్ శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

 

ఈ మేరకు స్టేడియం నిర్మాణ పనుల పురోగతిని చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "రాజధాని అమరావతిలో నవులూరు వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో దీనిని సిద్ధం చేస్తున్నాం" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

ఈ స్టేడియంను మొత్తం 24 ఎకరాల విస్తీర్ణంలో 34 వేల సీటింగ్ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. విజయవాడకు 13 కిలోమీటర్లు, గుంటూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వ్యూహాత్మకంగా ఇది నిర్మితమ‌వుతోంది. మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేసి, స్టేడియంను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. 

Search
Categories
Read More
Telangana
నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని
*నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని*   ఫిరాయింపు ఎమ్మెల్యే...
By Ellandula Sandeep 2025-12-24 14:22:20 0 612
Andhra Pradesh
పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరువలేము- చీరాల వాకర్స్ అసోసియేషన్
చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడు,గాంధేయవాది,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Vadlamudi NagaVenkat 2026-03-16 12:37:14 0 615
Andhra Pradesh
విజయవాడ పామర్రు లో కారు ప్రమాదం
Avja కృష్ణ జిల్లా   *పామర్రు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా...*  ...
By Rajini Kumari 2026-01-26 07:47:21 0 186
International
A testament to the deep & long standing 🇮🇳-🇬🇭 ties.....
President John Dramani Mahama conferred upon PM Narendra Modi ‘The Officer of the Order of...
By Bharat Aawaz 2025-07-03 07:27:15 0 2K
Andhra Pradesh
ఎమ్మిగనూర్ పట్టణంలోని బిజెపి జండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది బిజెపి నాయకులు
రాష్ట్ర అధ్యక్షులుశ్రీ PVN మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సూచన మేరకు ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-04-07 00:56:04 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com