Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.

0
355

14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు 

ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల కేటాయింపు

ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్ల కేటాయింపు

రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ-లాటరీని ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించనున్నారు. 

 

 

 

 

అలాగే, ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్లు ఇవ్వనున్నారు. అక్కడి 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఈ-లాటరీ నిర్వహిస్తారు. మరోవైపు, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే, మరోవైపు భవిష్యత్ అవసరాలు, విస్తరణ కోసం భూ సేకరణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగడం అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లోఆకట్టుకున్న పరమేశ్వరుని ఆర్ట్
పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపంలో ఉన్న శివాలయం ఆవరణంలో ఓ భక్తుడు శనివారం సుమారు...
By Kothuru Murali 2026-02-14 14:49:54 0 183
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరు పట్టణం లో అర్ధనారీశ్వరిగా దర్శనమిచ్చిన మారెమ్మ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శ్రీవిరుపాక్షి మారెమ్మ...
By Kothuru Murali 2026-02-15 07:52:48 0 177
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా గోపూజ మహోత్సవం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో గోపూజ మహోత్సవం అత్యంత వైభవంగా,...
By Rajini Kumari 2026-01-14 12:38:32 0 186
Andhra Pradesh
ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ దగ్గర రిలే నిరాహార దీక్ష
_ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్...
By Boya Dasthagiri 2026-03-30 12:50:27 0 209
Andhra Pradesh
ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్ తో మంత్రి మండిపల్లి భేటీ
Press Release  సచివాలయం,అమరావతి  (10-07-2026).    *హింద్రీనివా సుజల...
By Benguluri Madhubabu 2026-07-10 13:56:36 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com