Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.

0
360

14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు 

ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల కేటాయింపు

ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్ల కేటాయింపు

రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ-లాటరీని ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించనున్నారు. 

 

 

 

 

అలాగే, ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్లు ఇవ్వనున్నారు. అక్కడి 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఈ-లాటరీ నిర్వహిస్తారు. మరోవైపు, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే, మరోవైపు భవిష్యత్ అవసరాలు, విస్తరణ కోసం భూ సేకరణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగడం అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Idashisha Nongrang, IPS: Meghalaya's Trailblazing Leader
A distinguished 1992-batch Indian Police Service officer of the Assam–Meghalaya cadre,...
By Lokeshwari Panthadi 2026-07-22 13:37:30 0 38
Andhra Pradesh
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీకి తూట్లు పొడిచారు: షర్మిల.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం అన్నమయ్య జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ...
By Pagadala Venkateswar 2026-02-06 04:37:46 0 158
Business & Finance
Section 8 Company: A Smart Choice for Social Impact
A Section 8 Company is a non-profit organization registered under the Companies Act, 2013. It is...
By Navya Sree 2026-07-18 05:36:31 0 35
Andhra Pradesh
స్వర్ణాంధ్ర, స్వచ్ఛఆంధ్రతో కళాశాల ప్రాంగణం మెరిసింది
శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ Dr.S.K. అన్నార్ ఆదేశాల మేరకు NSS కోఆర్డినేటర్ T....
By Kothuru Murali 2026-06-20 15:28:53 0 73
Telangana
నేషనల్ క్రికెట్ లీగ్‌కు బాబాపూర్ గిరిజన యువకుడు ఎంపిక!
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ (కుమరం భీమ్ జిల్లా): కుమరం భీమ్ ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-06-04 02:19:43 0 453
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com